Big Stories

Delhi : ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు..

Delhi : ఢిల్లీ కేసీఆర్ పార్టీ “బీఆర్ఎస్” ఫ్లెక్సీలను ఢిల్లీ మునిసిపల్ కార్మికులు తొలగించారు. రేపు ఢిల్లీలో భారాస పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఇవి వీవీఐపీలు తిరిగే ప్రాంతం కావడం.. ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే మార్గం కావడంతో ఈ ఫ్లెక్సీలను తొలగించారు.

- Advertisement -

డిసెంబర్ 13న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నేతలు హాజరుకానున్నారు. సమవాజ్ వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. ఈ పార్టీలో దేశ రాజకీయాల్లో చర్చ మొదలైంది. కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టారు. కావున ఈ నేపధ్యంలో ఈ ఫ్లెక్సీల తొలంగింపు వివాదం రాజుకుంటోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News