E-Paper
Advertisement

Fadnavis Quit As Deputy CM: బీజేపీ కుటిల రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా, కాకపోతే..

Fadnavis Quit As Deputy CM: బీజేపీ కుటిల రాజకీయాలు, డిప్యూటీ సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా, కాకపోతే..

Fadnavis Quit As Deputy CM(Telugu news headlines today): సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర బీజేపీకి షాకిచ్చాయి. ఈసారి ఎక్కువ సీట్లు గెలవాలని వేసిన స్కెచ్ రివర్స్ అయ్యింది. దాని ఫలితంగా డిప్యూటీ సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. మహారాష్ట్రలో తమ పార్టీకి తక్కువ సీట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై పార్టీ కోసం తాను పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనికి కారణం బీజేపీ కుటిల రాజకీయాలేనా అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

మహారాష్ట్రలో బీజేపీ చాలా బలంగా ఉండేది. అధికారం కోసం అక్కడి శివసేన, ఎన్సీపీ పార్టీలను నిట్ట నిలువునా చీల్చేసింది బీజేపీ. ఆ పార్టీలకు గుర్తులు దక్కకుండా చేసింది. చివరకు ఆ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చింది బీజేపీ కూటమి. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయాలను గమనించిన ఓటర్లు ఈసారి ఊహించని ఝలక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఈసారి 9 సీట్లకు పరిమితం చేశారు. ఇక షిండే పార్టీకి ఏడు స్థానాలు రాగా, ఎన్సీపీ అజిత్ వర్గానికి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.

ఎప్పుడు లేని విధంగా ఈసారి కాంగ్రెస్- ఉద్దవ్-పవార్ వర్గాలు కలిసి మహా వికాస్ అఘాడీగా పేరుతో బరిలోకి దిగాయి. మొత్తం 48 సీట్లకు గాను 29 స్థానాలను గెలుచుకున్నాయి. సాంగ్లీ నుంచి కాంగ్రెస్ రెబల్ విశాల్ పాటిల్ విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి 17 స్థానాలకు పరిమితమైంది.

ALSO READ: ఇండియా కూటమిలోకి చంద్రబాబు రావడం ఖాయం, ఎందుకంటే..

ప్రాంతీయ పార్టీలను డ్యామేజ్ చేద్దారని భావించింది బీజేపీ. చివరకు ఫలితాలు రివర్స్ కావడంతో నైతిక బాధ్యత వహించి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. కానీ కొంతమంది బీజేపీ నేతలు మాత్రం మోదీ మంత్రివర్గంలో ఫడ్నవీస్‌కు ఛాన్స్ దక్కిందని, ఈ క్రమంలోనే రాజీనామా చేస్తారనే అంటున్నవాళ్లూ లేకపోలేదు. మహారాష్ట్రలో ఓటర్లు ఇచ్చిన ఫలితాలతో బీజేపీ తన తప్పు తెలుసుకుంటుందా? లేదా చూడాలి.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×