E-Paper
Advertisement

Uddhav says Chandrababu joining INDIA bloc?: ఇండియా కూటమిలోకి చంద్రబాబు రావడం ఖాయం, ఎందుకంటే..

Uddhav says Chandrababu joining INDIA bloc?: ఇండియా కూటమిలోకి చంద్రబాబు రావడం ఖాయం, ఎందుకంటే..
Advertisement

Uddhav says Chandrababu joining INDIA bloc?: హస్తినలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈసారి ఎన్డీయేకి ఈసారి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది ఇండియా కూటమి. అందుకు తగ్గట్టుగా తెర వెనుక మంతనాలు సాగిస్తోంది. బుధవారం సాయంత్ర ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి నేతలు సమావేశమవుతున్నారు.

మంగళవారం ఫలితాలు వెలువడిన తర్వాత ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు ఇండియా కూటమి నేతలు ఎన్డీయేలోని మిత్రులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు బయటపెట్టారు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. బీజేపీ చేతిలో వేధింపులకు గురైన వారంతా తమతో వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ముఖ్యంగా చంద్రబాబును మోదీ సర్కార్ వేధించిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, నితీష్‌కుమార్‌తో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

ప్రస్తుతం బీజేపీకి 240 సీట్లలో విజయం సాధించింది. మిత్రులతో ఆ సంఖ్య 292కు చేరింది. అటు ఇండియా కూటమికి 235 స్థానాలు వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు. చంద్రబాబు-జనసేన, నితీష్‌కుమార్ పార్టీలకు 30 సీట్లు వచ్చాయి. బీజేపీ తర్వాత ఎన్డీయేలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీల్లో టీడీపీ 16 సీట్లు రాగా, జేడీయూ 12 సీట్లు ఉన్నాయి.

ALSO READ: ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. నెక్ట్స్ ఏంటి ?

Advertisement

ఎన్డీయేకు బాబు, నితీష్ దూరమైతే ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నమాట. సాయంత్రం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి సమావేశం జరగనుంది. అందులోని తీసుకున్న నిర్ణయంపై తదుపరి అడుగులు వేయనుంది ఇండియా కూటమి. మొత్తానికి ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి ఓటర్లు వెరైటీగా తీర్పు ఇచ్చారు.

 

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×