BigTV English
Advertisement

Earthquake: కాశ్మీర్‌లో వరుస భూకంపాలు..వణికిపోయిన ప్రజలు

Earthquake: కాశ్మీర్‌లో వరుస భూకంపాలు..వణికిపోయిన ప్రజలు

Earthquake In Jammu Kashmir(Telugu breaking news): జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం వరుసగా స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూకంపం కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ఏం జరుగుతుందో తెలియక వణికిపోయారు. మరికొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం బారాముల్లా జిల్లాలో జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది.


కేంద్ర పాలిత ప్రాంతాలోని పలు జిల్లాలో ఈ భూకంప తీవ్రత కనిపించింది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బారాముల్లా జిల్లాలో భూమిలో 5 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది.

ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. అయితే తొలుత ఉదయం 6.45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. తర్వాత మరో 7 నిమిషాల వ్యవధిలో 6.52 గంటలకు 4.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం కూడా బారాముల్లా జిల్లాలోనే భూమికి 10కిలోమీటర్ల లోతున గుర్తించారు.


భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే పొరుగుదేశం పాకిస్తాన్ లోనే భూమి కంపించింది. అక్కడ కూడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

Also Read: పోస్టల్ GDS ఫలితాలు విడుదల.. ఏపీ, తెలంగాణ మెరిట్ జాబితా ఇదే

జమ్మూ కశ్మీర్ లో నెల రోజుల వ్యవధిలో భూమి కంపించడం ఇది రెండో సారి కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతకుముందు జూలై 12న బురాముల్లాలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×