E-Paper
Advertisement

Earthquake: కాశ్మీర్‌లో వరుస భూకంపాలు..వణికిపోయిన ప్రజలు

Earthquake: కాశ్మీర్‌లో వరుస భూకంపాలు..వణికిపోయిన ప్రజలు

Earthquake In Jammu Kashmir(Telugu breaking news): జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం వరుసగా స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూకంపం కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ఏం జరుగుతుందో తెలియక వణికిపోయారు. మరికొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం బారాముల్లా జిల్లాలో జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది.

కేంద్ర పాలిత ప్రాంతాలోని పలు జిల్లాలో ఈ భూకంప తీవ్రత కనిపించింది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బారాముల్లా జిల్లాలో భూమిలో 5 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది.

ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. అయితే తొలుత ఉదయం 6.45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. తర్వాత మరో 7 నిమిషాల వ్యవధిలో 6.52 గంటలకు 4.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం కూడా బారాముల్లా జిల్లాలోనే భూమికి 10కిలోమీటర్ల లోతున గుర్తించారు.

భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే పొరుగుదేశం పాకిస్తాన్ లోనే భూమి కంపించింది. అక్కడ కూడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

Also Read: పోస్టల్ GDS ఫలితాలు విడుదల.. ఏపీ, తెలంగాణ మెరిట్ జాబితా ఇదే

జమ్మూ కశ్మీర్ లో నెల రోజుల వ్యవధిలో భూమి కంపించడం ఇది రెండో సారి కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతకుముందు జూలై 12న బురాముల్లాలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×