E-Paper
Advertisement

Priyanka Gandhi on NEET Paper: మాఫియా చేతుల్లో విద్యా వ్యవస్థ: ప్రియాంక గాంధీ!

Priyanka Gandhi on NEET Paper: మాఫియా చేతుల్లో విద్యా వ్యవస్థ: ప్రియాంక గాంధీ!
Advertisement

Priyanka Gandhi on NEET Paper Leak: నీట్, యూజీసీ నెట్ సహా జాతీయ పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు కారణం మోదీ సర్కార్ అంటూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థను మాఫియా, అవినీతిపరులకు అప్పగించిందని మండిపడ్డారు. నీట్, యూజీసీ నెట్ పరీక్షలు ఇప్పటికే రద్దయ్యాయని.. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని ప్రియాంక గాంధీ అన్నారు.

దేశ విద్యావ్యవస్థ, పిల్లల భవిష్యత్తు అత్యాశాపరులకు అప్పగించారని మండిపడ్డారు. రాజకీయ నేతల దురహంకారం వల్లే పేపర్ లీక్‌లు, పరీక్ష రద్దులు జరుగుతున్నాయని అన్నారు. మోదీ పాలనలో క్యాంపస్ ల నుంచి విద్య మాయం అవుతుందని ద్వజమెత్తారు. రాజకీయ గుండాయిజం విద్యా వ్యవస్థకు గుర్తింపుగా మారిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేదని మండిపడ్డారు. యువత భవిష్యత్తుకు బీజేపీ అడ్డంకిగా మారిందన్నారు. దేశంలోని సమర్థులైన యువత వారి విలువైన సమయాన్ని, బీజేపీపై పోరాడేందుకు వృథా చేస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ మోదీ స్పందించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Also Read: మరోసారి మేనల్లుడికే పట్టం.. మాయావతి వారసుడిగా ఆకాష్ ఆనంద్.. 

జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడుతుండటంతో ప్రతిపక్ష నేతలు విమర్శల దాడిని మరింత పెంచారు. విద్యార్థుల జీవితంతో బీజేపీ ఆడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ ఆరోపించారు. బీజేపీ పాలనలో పేపర్ లీక్ అవుతున్నా.. ప్రధాని మోదీ మాత్రం స్పందించడం లేదు. ప్రధానిగా నాయకత్వ లక్షణాలను ఆయన కోల్పోయారు. కనీసం పని చేయలేని మంత్రులపై మోదీ చర్యలు తీసుకోలేకపోతున్నారని ఠాగూర్ మండిపడారు.

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×