E-Paper
Advertisement

BSP Chief Mayawati: మరోసారి మేనల్లుడికే పట్టం.. మాయావతి వారసుడిగా ఆకాష్ ఆనంద్..!

BSP Chief Mayawati: మరోసారి మేనల్లుడికే పట్టం.. మాయావతి వారసుడిగా ఆకాష్ ఆనంద్..!
Advertisement
Mayawati reinstates nephew Akash Anand as her successor: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి ప్రకటించారు.
అలాగే బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ పదవిలో ఆమె ఆకాష్‌ను తిరిగి నియమించారు. విశేషమేమిటంటే, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను నెల కిందట తన రాజకీయ వారసుడిగా, బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్‌గా తొలగించారు.
ఆకాష్ అపరిపక్వతే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం (జూన్ 23) లక్నోలో పార్టీ అధికారులందరితో సమావేశాన్ని నిర్వహించారు, ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత మీటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.

ఇటీవలి జరిగిన 2024 ఎన్నికలలో మాయావతి ఒంటరిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. అయితే 2019 ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకున్న మాయావతి 10 సీట్లు గెల్చుకున్నారు.

Also Read: ఇందుకోసమేనా తన మేనల్లుడిని మాయావతి ఆ పదవి నుంచి తొలిగించింది?

Advertisement

2024 ఎన్నికల్లో 80 సీట్లలో పోటీ చేసిన బీఎస్పీ ఒక్క సీటు గెల్చుకోలేకపోగా కేవలం 9.19 ఓటు శాతాన్ని సంపాదించుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ కేవలం 17 స్థానాల్లో పోటీ చేసి ఆరింట్లో విజయం సాధించి 9.46 శాతం ఓట్లను సొంతం చేసుకుంది.

బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల పనితీరును సమీక్షించడమే కాకుండా, ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం అనేక ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా, ఇదే సమావేశంలో మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తగా అలాగే తన రాజకీయ వారసుడిగా తిరిగి నియమిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Advertisement

Also Read: మాయావతి కీలక నిర్ణయం.. రాజకీయ వారసుడిని ప్రకటించిన బీఎస్పీ చీఫ్..

యూపీలోని 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ అధిష్టానం ఈ సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించింది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×