E-Paper
Advertisement

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. ఆ నంబర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే.. ఆ నంబర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Exit Polls 2026: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మళ్లింది. తాజాగా విడుదలైన వివిధ సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన హవాను కొనసాగిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. అదే సమయంలో దక్షిణాన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అస్సాం రాష్ట్రంలో కాషాయ జెండా మరోసారి ఎగరడం ఖాయమని యాక్సిస్ మై ఇండియా, పీపుల్స్ పల్స్ సర్వేలు చెబుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం అధికార బీజేపీ కూటమి 88-100 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండగా, పీపుల్స్ పల్స్ మాత్రం 68-72 స్థానాల మధ్య బీజేపీ నిలుస్తుందని పేర్కొంది. అస్సాంలో కాంగ్రెస్ కూటమి తీవ్ర ప్రభావం చూపలేకపోయిందని ఈ అంచనాలు చెబుతున్నాయి. అటు పుదుచ్చేరిలో కూడా బీజేపీ కూటమి 16-19 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి అధికారాన్ని చేపట్టే దిశగా సాగుతోంది.

Advertisement

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ‘దీదీ’ మ్యాజిక్ పనిచేసినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) 177-187 స్థానాలతో భారీ విజయాన్ని అందుకోబోతోంది. బీజేపీ 95-100 స్థానాల మధ్య గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అధికార పీఠానికి దూరంగానే ఉంది. ఇక తమిళనాడులో డీఎంకే కూటమి 125-145 స్థానాలతో ఏఐడీఎంకేను గద్దె దించబోతోందని అంచనా. ప్రత్యేకంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ 18-24 స్థానాలను గెలుచుకుని మూడవ అతిపెద్ద శక్తిగా అవతరించడం తమిళ రాజకీయాల్లో పెద్ద మలుపుగా పరిగణించవచ్చు.

కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు సాగగా, ఈసారి యూడీఎఫ్ (UDF) 75-87 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నట్లు పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఎల్డీఎఫ్ (LDF) 55-65 స్థానాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.

Advertisement

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని TVK 98-120 స్థానాలతో అధికారం దక్కించుకుంటుందని యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్ట్ ఇచ్చింది. ఇదే జరిగితే విజయ్ సీఎం అయ్యే అవకాశం ఉంది. డీఎంకే 92-110, ఏఐడీఎంకే 22-32 సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది. అయితే మెజార్టీ సర్వే సంస్థలు మాత్రం మళ్ళీ డీఎంకేదే అధికారమని వెల్లడించడం గమనార్హం. అన్ని రాష్ట్రాల అసలు ఫలితాలు మే నెలలో వెలువడనున్న నేపథ్యంలో, ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీస్తున్నాయి.

Read Also: పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. ప్రజలు టెన్షన్ పడొద్దు.. కిషన్ రెడ్డి భరోసా

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×