E-Paper
Advertisement

Delhi Blast: ఢిల్లీలో మరో పేలుడు.. భయంతో జనాలు పరుగులు

Delhi Blast: ఢిల్లీలో మరో పేలుడు.. భయంతో జనాలు పరుగులు
Advertisement

Delhi Blast: ఢిల్లీలో మరో పేలుడు సంభవించింది. మహిపాల్‌పూర్ ప్రాంతంలోని రాడిసన్ హోటల్ సమీపంలో.. పెద్ద శబ్దంతో పేలుడు లాంటి సంఘటన చోటుచేసుకుంది. క్షణాల్లో ఆ ప్రాంతం మొత్తం అలెర్ట్‌ అయింది. స్థానికులు, హోటల్ సిబ్బంది, ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఉదయం 9.18కి ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి పేలుడు ఆధారాలూ లేవని, ఇది తప్పు అలర్ట్ మాత్రమే అని నిర్ధారించారు. ఈ అలర్ట్‌కు కారణం ఒక మహిళ నుంచి వచ్చిన కాల్ అని పోలీసులు తెలిపారు. పేలుడు శబ్దం వచ్చిన ప్రదేశంలో పరిశీలించగా.. అక్కడున్న డీటీసీ బస్సు టైర్ పేలడం భారీ శబ్దం వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అక్కడ ఎలాంటి ఘటన చోటుచేసుకోకపోవడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు.

కాగా గత రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో.. జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందగా, మరో 20 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇది ఆత్మాహుతి దాడి అయనా కావచ్చు. లేకపోతే పేలుడు పదార్ధాలు తరలిస్తున్నప్పుడు యాక్సిడెంటల్ బ్లాస్ట్ అయినా అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అధికారులు. ఈ పేలుడు ఎలా సంభవించిందనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పేలుడుకు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేలుడుకు గురైన కారులో ఉన్న వ్యక్తి డాక్టర్ మహ్మద్ ఉమర్‌గా గుర్తించారు. ఇతను ఫరీదాబాద్ మాడ్యూల్‌లో ఉగ్రవాది అని నిఘా వర్గాలు తేల్చాయి.

Advertisement

Also Read: విశాఖలో 4 ఐటీ కంపెనీలకు.. లోకేష్ శంకుస్థాపన

ఫరీదాబాద్‌‌లో భారీ స్థాయిలో 2,900 కిలోల పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, డాక్టర్ల ముసుగులో ఉన్న ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ వార్తా దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో తాను కూడ పట్టుబడతాననే భయంతో టెర్రరిస్ట్ ఉమర్ ఈ దాడికి పాల్పడటం కానీ, లేక తన దగ్గరున్న పేలుడు పదార్ధాలను మరొక చోటుకి తరలించేందుకు చేసిన ప్రయత్నం వల్ల కానీ.. ఈ ఘటన జరిగి ఉండవచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి.

Advertisement

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×