E-Paper
Advertisement

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

gunfight in Jammu and Kashmir’s Kulgam: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లా ఆదిగామ్ గ్రామంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బందితోపాటు మరో పోలీసు అధికారి గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే గాయపడిన భద్రతా సిబ్బందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆర్మీ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. పోలీసులు, భద్రతా దళాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో దేవ్ సర్ ప్రాంతంలో ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపింది. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు జరిగిన వెంటనే ఉగ్రవాదులు పారిపోయారు.

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు సెప్టెంబర్ 15వ తేదీన పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×