BigTV English
Advertisement

Military Station : మిలిటరీ స్టేషన్ పై కాల్పులు.. నలుగురు మృతి.. ఎక్కడంటే..?

Military Station : మిలిటరీ స్టేషన్ పై కాల్పులు.. నలుగురు మృతి.. ఎక్కడంటే..?

Attack on Military base(National News) : పంజాబ్‌ లో సైనిక శిబిరంపై కాల్పులు కలకలం రేపాయి. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌ పై ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది.సైనిక స్థావరంలోని శతఘ్ని యూనిట్‌లో కాల్పుల ఘటన జరిగినట్లు సమాచారం. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే సైనికుల కుటుంబాలు నివసిస్తున్నాయి.


కాల్పులు శబ్దం వినిపించగానే మిలటరీ స్టేషన్‌లోని క్విక్‌ రియాక్షన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు.

ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, 28 తూటాలు మిసైయ్యాయి. కాల్పులకు వాటినే వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిగిన మిలిటరీ స్టేషన్‌ వద్దకు పంజాబ్‌ పోలీసులు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు ఆధీనంలోకి తీసుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదు.


బఠిండా వ్యూహాత్మకంగా కీలక సైనిక స్థావరం. ఇక్కడ 10వ కోర్‌ కమాండ్‌కు చెందిన దళాలు ఉన్నాయి. జైపూర్‌ కేంద్రంగా పనిచేసే సౌత్‌-వెస్ట్రన్‌ కమాండ్‌ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తోంది. బఠిండాలో భారీగా ఆపరేషనల్‌ ఆర్మీ యూనిట్లు, కీలక ఆయుధాలున్నాయి.

Related News

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Big Stories

×