E-Paper
Advertisement

Military Station : మిలిటరీ స్టేషన్ పై కాల్పులు.. నలుగురు మృతి.. ఎక్కడంటే..?

Military Station : మిలిటరీ స్టేషన్ పై కాల్పులు.. నలుగురు మృతి.. ఎక్కడంటే..?

Attack on Military base(National News) : పంజాబ్‌ లో సైనిక శిబిరంపై కాల్పులు కలకలం రేపాయి. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌ పై ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది.సైనిక స్థావరంలోని శతఘ్ని యూనిట్‌లో కాల్పుల ఘటన జరిగినట్లు సమాచారం. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే సైనికుల కుటుంబాలు నివసిస్తున్నాయి.

కాల్పులు శబ్దం వినిపించగానే మిలటరీ స్టేషన్‌లోని క్విక్‌ రియాక్షన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు.

ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, 28 తూటాలు మిసైయ్యాయి. కాల్పులకు వాటినే వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిగిన మిలిటరీ స్టేషన్‌ వద్దకు పంజాబ్‌ పోలీసులు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు ఆధీనంలోకి తీసుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదు.

బఠిండా వ్యూహాత్మకంగా కీలక సైనిక స్థావరం. ఇక్కడ 10వ కోర్‌ కమాండ్‌కు చెందిన దళాలు ఉన్నాయి. జైపూర్‌ కేంద్రంగా పనిచేసే సౌత్‌-వెస్ట్రన్‌ కమాండ్‌ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తోంది. బఠిండాలో భారీగా ఆపరేషనల్‌ ఆర్మీ యూనిట్లు, కీలక ఆయుధాలున్నాయి.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×