E-Paper
Advertisement

America : యూఎస్ లో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి..

America : యూఎస్ లో మరోసారి కాల్పులు.. నలుగురు మృతి..
Advertisement

America : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సౌత్‌ఈస్ట్‌ వాషింగ్టన్‌లోని అనకోస్టియా ప్రాంతంలో గుడ్‌హోప్‌ రోడ్‌లో దుండగుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. కాల్పుల సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సౌత్‌ఈస్ట్‌ వాషింగ్టన్‌లోని అనకోస్టియా ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు కాల్పులకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
వాషింగ్టన్‌లో ఈ ఏడాది ఇప్పటికే అనేక కాల్పుల ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు 150 మందికిపైగా మృత్యువాతపడ్డారు. 2 దశాబ్దాల తర్వాత తక్కువ సమయంలో భారీ సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వాష్టింగన్‌ పోస్ట్‌ తెలిపింది. ఆగస్టులో ఇప్పటివరకు జరిగిన కాల్పుల ఘటనల్లో 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.

Advertisement

అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి. అమాయకుల ప్రాణాలను ఉన్మాదులు బలి తీసుకుంటారు. షాపింగ్ మాల్స్, స్కూల్స్, ఆడిటోరియాలను లక్ష్యం చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×