E-Paper
Advertisement

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!
Advertisement

Air India Flight: ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులకు కాసేపు తీవ్ర ఆందోళన కలిగించే సంఘటన ఎదురైంది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌ వైపు మళ్లింపు..

Advertisement

విజ‌య‌వాడ‌లో ల్యాండ్ అవ్వాల్సిన స‌మాయానికి ఇంజిన్‌లో స‌మ‌స్య గుర్తించిన పైలట్, ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. అయితే ప్రయాణంలో ఉండగానే ఆ సాంకేతిక లోపం సరికావడంతో.. పైలట్ మళ్లీ విమానాన్ని విజయవాడ వైపు తిప్పారు. గాల్లో ఏర్పడిన ఈ ఊహించని పరిణామంతో విమానంలో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

విమానంలో మంత్రి, ప్రజాప్రతినిధులు

Advertisement

ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు సహా మొత్తం 180 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, సమస్యను అధిగమించి విమానాన్ని విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఉపశమనం వ్యక్తం చేశారు.

Also Read: ఒకే ఫార్ములా.. ఇద్దరు నేతలు.. ఒకరిది జైలు, ఇంకొకరిది సెటిల్‌మెంట్!

Tags

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

Big Stories

Advertisement
×