BigTV English
Advertisement

Congress party: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఈవీఎం వ్యత్యాసాల పరిశీలనకు కమిటీ!

Congress party: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఈవీఎం వ్యత్యాసాల  పరిశీలనకు కమిటీ!

Haryana elections congress party Investigate EVM complaints: హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు విషయంలో పార్టీ అభ్యర్థుల ఫిర్యాదులు, ఈవీఎంలలో వ్యత్యాసాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విచారణ ముగిసే వరకు సీల్ చేసి భద్రపర్చాలని ఈసీని కోరారు.


ఇందులో భాగంగానే ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని తెలిపింది.

అయితే మరో 13 సెగ్మెంట్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నట్లు తెలిపింది.


Also Read: ఢిల్లీలో భారీగా డ్రగ్స్.. రూ.2 వేల కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

ఇందులో భాగంగానే మాజీ సీఎంలు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అజయ్ మాకెన్, పవన్ ఖేరాలతో కూడిన సీనియర్ నేతల బృందం, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ లు ఈసీ అధికారులతో సమావేశమయ్యారు.

హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదలైన సంగతి తెలిసిందే. తొలుత ఓట్లు లెక్కించగా కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. ఆ తర్వాత వెంటనే ఫలితాలు రివర్స్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ సంబరాలకు బ్రేక్ పడింది. ఒక్కసారిగా బీజేపీ ఫామ్ లోకి వచ్చి విజయ దిశగా పరుగులు పెట్టింది. దీంతో కాంగ్రెస్ నాయకులు షాక్ కుగ గురయ్యారు. ఓవరాల్ గా బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. బీజేపీ విజయాన్ని స్వాగతించమని ప్రకటించింది.

Related News

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Big Stories

×