E-Paper
Advertisement

Hemant Soren | ఝార్ఖండ్ సిఎం మిస్సింగ్.. భారీ నగదు, BMW కారు సీజ్ చేసిన ఈడీ!

Hemant Soren | ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సోమవారం ఢిల్లీలోని ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటిలో తనిఖీలు చేసింది. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి కనిపించడం లేదు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ సమాచారం లేదు. ఈడీ అధికారులు ఆయన ఇంటి నుంచి 36 లక్షలు నగదు, ఒక బియండబ్యూ సీజ్ చేశారు.

Hemant Soren | ఝార్ఖండ్ సిఎం మిస్సింగ్.. భారీ నగదు, BMW కారు సీజ్ చేసిన ఈడీ!
Advertisement

Hemant Soren | ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సోమవారం ఢిల్లీలోని ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటిలో తనిఖీలు చేసింది. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి కనిపించడం లేదు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ సమాచారం లేదు. ఈడీ అధికారులు ఆయన ఇంటి నుంచి 36 లక్షలు నగదు, ఒక బియండబ్యూ సీజ్ చేశారు.

హేమంత్ సొరెన్ ఢిల్లీ బంగ్లాలో ఈడీ అధికారులు 13 గంటలపాటు ఈ తనిఖీలు చేశారు. భూ కుంభకోణం కేసులో మనిలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ అధికారులు ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు వెళ్లారు. అయితే హేమంత్ సోరెన్ లేకపోవడంతో ఈ తనిఖీలు చేపట్టారు. జాతియా మీడియా కథనాల ప్రకారం.. ఈడీ అధికారులు బుధవారం ఝార్ఖండ్‌లోని సిఎం అధికారిక నివాసంపై కూడా తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది.

Advertisement

జెఎంఎం పార్టీ సమావేశం
ఝార్ఖండ్ అధికార పార్టీ ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన అందరు ఎమెల్యేలు రాష్ట్రంలోనే ఉండాలని పార్టీ అగ్రనేతలు ఆదేశించారు. ఎమ్మెల్యేలందరూ మంగళవారం అత్యవసర సమావేశానికి హాజరు కావాలని పార్టీ అధిష్టానం చెప్పింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.

భూకుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారుల పలుమార్లు సిఎం హేమంత్ సోరెన్‌కు సమన్లు జారీ చేశారు. అయితే ఆయన హాజరు కాలేదు. ఇటీవలే రాష్ట్ర రాజధాని రాంచీలో ఈడీ అధికారులు ఆయనను ఈ కేసులో ప్రశ్నించారు. ఆ తరువాత జనవరి 29 లేదా జనవరి 30న మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పారు. కానీ హేమంత్ సోరెన్ ఢిల్లీ బయలుదేరినట్లు తెలియగానే ఈడీ అధికారులు కూడా ఢిల్లీ చేరుకొని ఆయన బంగ్లాలో తనిఖీలు చేశారు.

Advertisement

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×