E-Paper
Advertisement

India on Iran Israel: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. గల్ఫ్ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ హై అలర్ట్!

India on Iran Israel: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. గల్ఫ్ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ హై అలర్ట్!
Advertisement

India on Iran Israel: పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం మరియు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరతపై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని భారత్ హెచ్చరించింది. ముఖ్యంగా పౌరులు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని భారత ప్రభుత్వం అభిప్రాయపడింది.

పశ్చిమాసియాలో సుమారు కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్న నేపథ్యంలో, అక్కడి భద్రతా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. యుద్ధ మేఘాల కారణంగా విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడటం, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల విదేశీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంపై విదేశాంగ శాఖ స్పందించింది. సంబంధిత దేశాలు సంయమనం పాటించాలని, తక్షణమే హింసను వీడి చర్చల దిశగా అడుగులు వేయాలని భారత్ కోరింది.

Advertisement

గల్ఫ్ దేశాల్లో స్థిరత్వం దెబ్బతింటే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతంలోని తమ పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అవసరమైన చోట ఎంబసీల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని తెలిపింది. రణరంగంగా మారిన పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు అంతర్జాతీయ సమాజం సమన్వయంతో పనిచేయాలని భారత్ పిలుపునిచ్చింది.

మ‌రోవైపు పశ్చిమ ఆసియాలో ఇరాన్.. ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు గగనతల ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) పై కూడా ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శంషాబాద్ నుండి పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లాల్సిన సుమారు 10 విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి. గల్ఫ్ ప్రాంతానికి ప్రయాణించే వారు.. అక్కడ నుండి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని ఢిల్లీ.. ముంబై.. బెంగళూరు వంటి ప్రధాన విమానాశ్రయాల నుండి ఇరాన్.. ఇజ్రాయెల్ వైపు వెళ్లాల్సిన అన్ని విమాన సర్వీసులు రద్దు కావడం గమనార్హం.

Advertisement

Read Also: US Israel Attacks: ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తృటిలో బయటపడిన ఎన్టీఆర్!

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×