E-Paper
Advertisement

Trump on IND PAK War: ది ఎండ్.. భారత్- పాక్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచలన ప్రకటన

Trump on IND PAK War: ది ఎండ్.. భారత్- పాక్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచలన ప్రకటన
Advertisement

Trump on IND PAK War: మొత్తానికి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి పులిస్టాప్ పడింది. మిసైల్స్, డ్రోన్ల అటాక్ లు, కాల్పుల మోతలు ఆగిపోయాయి. దాయాది దేశం కోరిక మేరికు భారత ప్రభుత్వం కాల్పులు విరమణకు ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. భారత్- పాకిస్థాన్ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన చర్యలు సఫలం అయ్యాయి. రెండు దేశాలు కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే భారత్- పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కీలక ప్రటనే ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని అన్నారు. తక్షణ సీజ్ ఫైర్‌ కు భారత్, పాకిస్థాన్ అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. రాత్రంతా భారత్- పాకిస్థాన్ దేశాలతో చర్చించామని అన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలకు అభినందనలు తెలిపారు.

Advertisement

Also Read: India Vs Pakistan War : హిందువులు, ఆలయాలే టార్గెట్.. పహల్గాం ఉగ్రవాదుల్లానే పాకిస్తాన్

ఈ క్రమంలోనే విదేశాంగ కార్యదర్శి మిస్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కాల్పుల విరమణను భారత ప్రభుత్వం ధృవీకరించినట్టు తెలిపారు. ‘సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి. ఈ రోజు  మధ్యాహ్నం 3:35 గంటలకు పాక్ డీజీఎంవో నుంచి భారత్ డీజీఎంవోకు ఫోన్ కాల్ వచ్చింది. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలించినట్టు పాక్ మంత్రి ఇషాక్ దర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఈ నెల 12న ఇరు దేశాల మిలటరీ జనరల్ తదుపరి చర్చల గురించి మాట్లాడుకోనున్నారు’ అని ఆయన వెల్లడించారు.

Advertisement

Also Read: Venu Swamy Prediction: యుద్ధంలో పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు: వేణుస్వామి జోస్యం

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×