E-Paper
Advertisement

Jay Shah – IPL: PSL 2025కు UAE నో పర్మిషన్….చక్రం తిప్పిన జై షా

Jay Shah – IPL:  PSL 2025కు UAE  నో పర్మిషన్….చక్రం తిప్పిన జై షా
Advertisement

Jay Shah – IPL: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ గురించి సంచలన విషయం బయటపడింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ ను దుబాయ్ కి తరలించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ తరలింపునకు ముందుగా దుబాయ్ ఓకే చెప్పి ఆ తర్వాత.. హ్యాండ్ ఇచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును తమ దేశంలో నిర్వహించడానికి వీలు లేదని దుబాయ్ సర్కార్ స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.

Also Read: IPL 2025 Update: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఈ 3 మూడు వేదికల్లోనే మ్యాచ్ లు

Advertisement

అయితే… ఈ విషయంలో దుబాయ్ వెనక్కి తగ్గడం వెనుక ఐసీసీ చైర్మన్ జై షా ఉన్నాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ ను దుబాయ్ లో నిర్వహిస్తే… మీకు ఐసీసీ నుంచి వచ్చే ఆర్థిక నిధులు ఆపేస్తామని జైషా వార్నింగ్ ఇచ్చాడని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ వెనక్కి తగ్గిందని వార్తలు వస్తున్నాయి.

గత ఏడాది చివర లో భారత నియంత్రణ మండలి కార్యదర్శిగా ఉన్న జై షా… ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే… దుబాయ్ పై ఒత్తిడి పెంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు చుక్కలు చూపించారు. అప్పట్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు కూడా పాకిస్తాన్ లో జరగకుండా హైబ్రిడ్ మోడల్ లో జరిగేలా… పాకిస్తాన్ మెడలు వంచాడు. ఈ దెబ్బకు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… సగం పాకిస్తాన్ అలాగే.. ఇండియా మ్యాచ్లు దుబాయిలో జరిగాయి. ఇక ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్కు కూడా షాక్ ఇచ్చేలా… చక్రం తిప్పారు అమిత్ షా కుమారుడు జై షా.

Advertisement

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రీస్టార్ట్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కాసేపటి క్రితమే యుద్ధం ముగిసింది. దింతో ఐపిఎల్ 2025 పునః ప్రారంభం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రేపు లేదా ఎల్లుండి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు…. సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా ఐపిఎల్ షెడ్యూల్.. ఫైనల్ చేస్తారు. పాకిస్తాన్ బోర్డర్ కు దగ్గరగా ఉన్న స్టేడియాలలో కాకుండా… దక్షిణ భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే… హైదరాబాద్, చెన్నై అలాగే బెంగళూరు వేదికలలో మ్యాచులు జరుగుతాయి. ఈ ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో కీలకమైన 16 మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఈ 16 మ్యాచ్లను కూడా… కేవలం మూడు స్టేడియాలలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఎలాంటి యుద్ధం జరిగిన కూడా సమస్యలు రావని అంచనా వేస్తున్నారు అధికారులు.

Also Read: Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ లో ఐపీఎల్ ప్లేయర్స్.. ఎంత ఖర్చు చేశారో తెలుసా ?

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×