E-Paper
Advertisement

Nityananda Swami: స్వామి ఆచూకీ తెలిసింది.. కోర్టుకు చెప్పిన ఆయన శిష్యురాలు

Nityananda Swami: స్వామి ఆచూకీ తెలిసింది.. కోర్టుకు చెప్పిన ఆయన శిష్యురాలు
Advertisement

Nityananda Swami: దేశంలో బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో స్వామి నిత్యానంద ఒకరు. కొన్నాళ్లుగా ఆయన ఎక్కడ ఉన్నారో తెలీదు. చివరకు ఆయన జాడ తెలిసింది. మద్రాస్ హైకోర్టుకి నిత్యా శిష్యురాలు కీలక విషయాలు వెల్లడించింది. దీంతో స్వామిని తీసుకొస్తారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తనను తాను ఆధ్యాత్మిక గురువుగా పరిచయం చేసుకున్నాడు స్వామి నిత్యానంద . కొన్నాళ్లుగా ఆయన కనిపించకపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి. బతికుండగనే కైలాసంలో నివాసం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతకీ కైలాష్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. కొందరేమో అమెరికా-జపాన్ మధ్య అని చెబుతారు. ఇంకొందరు థాయ్‌లాండ్ సమీపంలోని ఓ దీవిలో ఉన్నట్లు చెబుతున్నారు.

Advertisement

కానీ కైలాష్ దేశం ఎక్కడ ఉందో ఎవరికీ క్లారిటీ లేదు. చివరకు నిత్యానందస్వామి ఆచూకీ బయటపడింది. ఆస్ట్రేలియా సమీపంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దీవిలో ఉన్నట్లు ఆయన శిష్యురాలు అర్చన మద్రాసు హైకోర్టులోని మదురై ధర్మాసనానికి తెలియజేసింది. నిత్యానంద జాడ తెలియడంతో ఆయన దేశంలో ఎప్పుడు అడుగుపెడతాడు? అనేది ఆయన భక్తుల్లో ఆసక్తిగా మారింది.

ఇంతకీ నిత్యానంద వస్తాడా? అక్కడే నుంచి అంతా నడపిస్తున్నాడా? అనేదానిపై చర్చ మొదలైంది. మదురైలోని ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదంటూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్  ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా ఆయన జాడ విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

ALSO READ: తొక్కిసలాట జరిగితే కఠిన శిక్షలు

పిటిషన్ విచారణ సందర్భంగా నిత్యానంద తరపు శిష్యురాలు అర్చన స్వయంగా న్యాయస్థానం ఎదుట హాజరైంది. నిత్యానంద తరపు వాదనలు ఆయన న్యాయవాది వినిపించారు. ఆస్ట్రేలియాకు సమీపంలోని ఓ దీవిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ పేరిట ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ప్రాంతంలో ఆయన ఉన్నట్లు కోర్టుకు తెలిపింది శిష్యురాలు.

కొన్నాళ్లు కిందట నిత్యానంద ఆచూకీపై ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది. కైలాస దేశం ఎక్కడ ఉంది? అక్కడికి వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ ఉండాలా? అంటూ ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది.  ఆధీనం మఠంలోకి నిత్యానంద ఎంట్రీకి న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే.. కైలాష్ దేశం నుంచి వస్తాడని అంటున్నారు ఆయన హార్డ్‌కోర్ భక్తులు.

Related News

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

Big Stories

Advertisement
×