Delhi: అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారని చెబుతారు. పైన కనిపిస్తున్న ఢిల్లీలోని ఓ మహిళ విషయంలో అదే జరిగింది. లాటరీలో ఏకంగా రూ.65 గెలుచుకుంది. తనకు లాటరీ పలకడంతో సదరు మహిళ ఉబ్బితబ్బిబ్బై పోతోంది. ఇంతకీ ఆ లాటరీ ఏంటి? ఇటీవల దేశంలోని చాలామంది వ్యక్తులకు లాటరీ ద్వారా లక్ష్మిదేవి తలుపు తడుతోంది.
అబుదాబిలో జాక్పాట్ కొట్టింది భారతీయ మహిళ. ఏకంగా రూ. 62 కోట్ల లాటరీని గెలుచుకుంది సదరు మహిళ. ఢిల్లీకి చెందిన కనికా అరోరా అనే గృహిణి లాటరీలో రూ. 62 కోట్ల ప్రైజ్మనీ వరించింది. అబుదాబిలో నిత్యం లాటరీ నిర్వహిస్తారు. బిగ్ టికెట్ సిరీస్లో భాగంగా ప్రతీ నెల లాటరీ టికెట్ కొనుగోలు చేసింది ఆ మహిళ. జూన్ 30న జరిగిన లాటరీలో 25 మిలియన్ దిర్హమ్ ఆమెని వరించింది.