Indian Student: విదేశాల్లో భారత్కు చెంది మరో తెలుగు విద్యార్థి మృతి.. యూకేలోని వోర్స్టర్ లో నవంబర్ 25న ఉదయం 4:15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రం చర్ఖీ దాద్రి జిల్లా జాగ్రాంబాస్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దారుణంగా కత్తిరాళ్లతో దాడి చేశారు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ రోజు మధ్యాహ్నం మృతి చెందాడు.
విజయ్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నత చుదువుల కోసం యూకే వెళ్లాడు. బ్రిస్టాల్లోని UWEలో చదువుతున్నాడు. భారతదేశంలో ఉన్న ఉద్యోగంను వదులుకుని విదేశాల్లో భవిష్యత్తును రూపొందించుకోవాలనే ఆశతో యూకే చేరాడు. కానీ, గుర్తు తెలియని వ్యక్తుల చేతులో మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు CCTV ఫుటేజ్లు, సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.
అయితే, విజయ్ సోదరుడు రవి కుమార్, హర్యానా-పంజాబ్కు చెందిన కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నాడు. “విజయ్పై హర్యానా, పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేశారు” అని రవి తన లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.
Also Read: హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత..పువర్తిలో ప్రస్తుత పరిస్థితి ఇదే!
అలాగే విజయ్ కుమార్ మృతదేహాన్ని వెంటనే భారత్కు తీసుకురావడానికి సహాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబసభ్యులు విదేశాంగ మంత్రిత్వ శాఖ, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలను సహాయం కోరారు.
యూకేలో భారత విద్యార్థి దారుణ హత్య!
యూకేలోని వోర్టర్లో నవంబర్ 25న విజయ్ కుమార్ షియోరాన్(30) అనే యువకుడిపై దుండగులు కత్తులతో దాడి
ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి
ఈ కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
హర్యానాకు చెందిన విజయ్ కుమార్… pic.twitter.com/GuEXc7fjeM
— BIG TV Breaking News (@bigtvtelugu) November 30, 2025