E-Paper
Advertisement

IndiGo- Air India: అటెన్షన్ ప్లీజ్.. ప్రయాణికులకు ముఖ్య గమనిక, ఎయిరిండియా-ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ జారీ

IndiGo- Air India: అటెన్షన్ ప్లీజ్.. ప్రయాణికులకు ముఖ్య గమనిక, ఎయిరిండియా-ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ జారీ
Advertisement

IndiGo- Air India: శీతాకాలం సీజన్ నేపథ్యంలో ఉత్తర భారతదేశాన్ని చలి-పులి వణికిస్తోంది. ఉష్టోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీని ప్రభావం అటు విమానాల రాకపోకలపై పడింది. ఈ నేపథ్యంలో ఇండిగో-ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ సంస్థలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి.

విమాన  ప్రయాణికులకు ముఖ్య గమనిక

Advertisement

శీతాకాలం ప్రారంభం కావడంతో ఉత్తర భారతదేశమంతటా రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీని కారణంగా విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది.

ఈ సమాచారాన్ని ప్రయాణికులకు అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఎయిర్ పోర్టుకు వెళ్ళేముందు ట్రావెల్ ప్రస్తుత స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచన చేసింది. ఈ విషయంలో వాతావరణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అసౌకర్యాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత సౌకర్యవంతంగా ఉండేలా తాము అన్నిరకాల సర్దుబాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ఎయిరిండియా-ఇండిగో సంస్థలు

మీ అవగాహనకు, మాపై మీ నమ్మకాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేసింది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, ప్రయాణాలు సజావుగా చేయడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఎయిర్ ఇండియా సంస్థ కూడా ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరి జారీ చేసింది.

ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాల ప్రయాణాలు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. దీని కారణంగా అనేక విమానాలు ఆలస్యంగా బయలు దేరుతున్నాయని, మరి కొన్నింటిని రద్దు చేసినట్టు పేర్కొంది.

అనివార్య పరిస్థితులు ఎదురైతే.. ప్రయాణీకులకు రీబుకింగ్ లేదా వారి విమానాలు రద్దు చేయబడితే పూర్తి వాపసు అందించడంలో సహాయం చేయడానికి మా బృందాలు 24 గంటలు పని చేస్తున్నాయని రాసుకొచ్చింది. ఇవాళ పొగమంచు పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్టు తెలియజేసింది.

ALSO READ: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. మంటల్లో నాలుగు బస్సులు

కొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను ఇప్పటికే రద్దు చేశామని తెలిపింది. అసౌకర్యాన్ని తగ్గించడానికి ఫాగ్ కేర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామని రాసుకొచ్చింది. దీని కారణంగా ప్రభావితమైన, ప్రభావితమయ్యే విమానాల గురించి సమాచారం ప్రయాణీకులకు ముందుగానే తెలియజేస్తున్నట్లు ప్రస్తావించింది.

రీషెడ్యూలింగ్ లేదా మనీని పూర్తి వాపసు అందిస్తామని రాసుకొచ్చింది. ప్రభావితమైన ప్రయాణీకుల వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా సంప్రదిస్తామని తెలిపింది. మా నుండి ఎలాంటి సమాచారం అందకపోతే, మీ బుకింగ్‌లోని సంప్రదింపు సమాచారం మీ ట్రావెల్ ఏజెంట్ లేదా మీ తరపున బుక్ చేసుకున్న వ్యక్తిది కావచ్చు, వారికి నోటిఫికేషన్ పంపబడుతుందని పేర్కొంది. విమానాశ్రయం బయలుదేరే ముందు విమాన స్థితిని తనిఖీ చేసి ప్రయాణాలకు అనుమతి ఇస్తామని, అందుకోసం అదనపు సమయం కేటాయించవలసి వస్తుందని పేర్కొంది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×