Road Accidents: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఒకే రోజు ఉదయాన్నే మూడు ప్రమాదాలు.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో జమ్మలమడుగు హైవేపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్ర గాయాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్పందించిన స్థానికులు, సహాయక బృందాలు క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్లో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు హైవేపై రైతులు ధాన్యం ఆరబోసి ఉండటం, అదే సమయంలో కారు అతి వేగంతో దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో వస్తున్న కారు డ్రైవర్ ధాన్యం పోసి ఉన్న విషయాన్ని గమనించ లేకపోయాడు. దీంతో నియంత్రణ కోల్పోయిన కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన మహిళ వివరాలు, గాయపడిన వారి పూర్తి గుర్తింపు, డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆరా తీస్తున్నారు.
అదుపు తప్పి బోల్తా పడిన కారు..
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ శివారులో ఘటన
రోడ్డుపై ఆరబోసిన ధాన్యం గమనించకపోవడంతో ప్రమాదం
కారులో ప్రయాణిస్తున్న బొప్పన నాగమణి అనే మహిళ మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు pic.twitter.com/i0saYO0qH7
— BIG TV Breaking News (@bigtvtelugu) December 16, 2025
మరో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్లో ఫ్లై ఓవర్ పై ఢీకొన్న 3 కార్లు..
ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఉదయం పూట ఏర్పడిన దట్టమైన పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు సరిగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, దెబ్బతిన్న వాహనాలను తొలగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనదారులు పొగమంచు సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఫ్లై ఓవర్ పై ఢీకొన్న 3 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ బ్రిడ్జ్ పై ఘటన pic.twitter.com/SHLWCKquK4
— BIG TV Breaking News (@bigtvtelugu) December 16, 2025