E-Paper
Advertisement

IndiGo : విమానం ఆలస్యం.. పైలట్‌పై ప్రయాణికుడి దాడి..

IndiGo : విమానంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్‌ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్‌పై దాడికి పాల్పడ్డాడు. ఇండిగో విమానంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

IndiGo : విమానం ఆలస్యం.. పైలట్‌పై ప్రయాణికుడి దాడి..
Advertisement

IndiGo : విమానంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్‌ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్‌పై దాడికి పాల్పడ్డాడు. ఇండిగో విమానంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

డిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానానికి పొగమంచు కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణం ఆలస్యం అవుతుందని పైలట్ ప్రకటించాడు. ఇది విన్న వెంటనే ఓ ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. చివర వరుసలో కూర్చున్న అతడు పైలట్‌ వద్దకు దూసుకువచ్చి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఇండిగో ఫిర్యాదు చేసింది. అతడిని విమానం నుంచి దించేశారు. భద్రతా సిబ్బందికి అప్పగించింది. ఈ విమానం 13 గంటల ఆలస్యమైంది. విమానం ఆలస్యానికి అందులోని సిబ్బంది ఏం చేస్తారు..? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి, నో ఫ్లై లిస్ట్‌లో చేర్చండి అంటూ డిమాండ్ చేశారు.

Advertisement

ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దాంతో భారీ సంఖ్యలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం సైతం పొగమంచు కారణంగా వందకు పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. 79 రద్దయ్యాయి. కాగా ఒక్కో విమానం కనీసం 50 నిమిషాల మేర ఆలస్యంగా నడుస్తోంది. ఈ పరిస్థితులతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు.

Tags

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. గుజరాత్‌లో ఘటనపై

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×