E-Paper
Advertisement

Maharashtra News : జర్నలిస్ట్‌ను చితక్కొట్టిన అధికారపార్టీ నేతలు.. వీడియో వైరల్..

Maharashtra News  : జర్నలిస్ట్‌ను చితక్కొట్టిన అధికారపార్టీ నేతలు.. వీడియో వైరల్..
Advertisement
Maharashtra News

Maharashtra News : మహారాష్ట్రలోని పచోరాలో జర్నలిస్ట్ సందీప్ మహాజన్‌పై షిండే వర్గాలు దారుణంగా దాడి చేశాయి. స్కూటీపై వెళ్తుండగా కిందపడేసి మరీ చావబాదారు. జల్గావ్-పచోరా తాలూకా ఎమ్మెల్యే కిషోర్ పాటిల్.. జర్నలిస్టు సందీప్ మహాజన్‌ను దుర్భాషలాడిన ఆడియో క్లిప్ ఇటీవల వైరల్‌గా మారింది. కొడతానని ఎమ్మెల్యే బెదిరించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవా అని ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

జర్నలిస్టు సందీప్ మహాజన్‌ను పచోరాలో కొట్టిన వీడియోను ఎమ్మెల్యే రోహిత్ పవార్ ట్వీట్ చేశారు. జర్నలిస్టును ఫోన్‌లో దుర్భాషలాడారని, చంపేస్తామని బెదిరించారని, మరుసటి రోజు జర్నలిస్టును కొట్టేందుకు గూండాలను పంపారని రోహిత్ పవార్ అన్నారు. ఓ జర్నలిస్టును ఈ విధంగా కొట్టినప్పుడు మహారాష్ట్రలోని జర్నలిస్టులు నిరసన తెలిపే సాహసం కూడా చేయలేదని ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే.. ఇటీవల బాలికను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన ఉదంతం జలగావ్ జిల్లాను కుదిపేసింది. ఈ అంశంపై జర్నలిస్టు సందీప్‌ మహాజన్‌.. షిండేపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శను ఎమ్మెల్యే కిషోర్ పాటిల్ జీర్ణించుకోలేక.. నేరుగా జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో, జర్నలిస్టులు ఆడియో క్లిప్ గురించి పాటిల్‌ను ప్రశ్నించారు. ఆ ఆడియో క్లిప్ తనదేనని, జర్నలిస్టును దూషించింది తానేనని కూడా ఎమ్మెల్యే కిషోర్ బాహాటంగా ఒప్పుకున్నారు.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×