BigTV English

Maharashtra News : జర్నలిస్ట్‌ను చితక్కొట్టిన అధికారపార్టీ నేతలు.. వీడియో వైరల్..

Maharashtra News  : జర్నలిస్ట్‌ను చితక్కొట్టిన అధికారపార్టీ నేతలు.. వీడియో వైరల్..
Maharashtra News


Maharashtra News : మహారాష్ట్రలోని పచోరాలో జర్నలిస్ట్ సందీప్ మహాజన్‌పై షిండే వర్గాలు దారుణంగా దాడి చేశాయి. స్కూటీపై వెళ్తుండగా కిందపడేసి మరీ చావబాదారు. జల్గావ్-పచోరా తాలూకా ఎమ్మెల్యే కిషోర్ పాటిల్.. జర్నలిస్టు సందీప్ మహాజన్‌ను దుర్భాషలాడిన ఆడియో క్లిప్ ఇటీవల వైరల్‌గా మారింది. కొడతానని ఎమ్మెల్యే బెదిరించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవా అని ప్రశ్నిస్తున్నాయి.

జర్నలిస్టు సందీప్ మహాజన్‌ను పచోరాలో కొట్టిన వీడియోను ఎమ్మెల్యే రోహిత్ పవార్ ట్వీట్ చేశారు. జర్నలిస్టును ఫోన్‌లో దుర్భాషలాడారని, చంపేస్తామని బెదిరించారని, మరుసటి రోజు జర్నలిస్టును కొట్టేందుకు గూండాలను పంపారని రోహిత్ పవార్ అన్నారు. ఓ జర్నలిస్టును ఈ విధంగా కొట్టినప్పుడు మహారాష్ట్రలోని జర్నలిస్టులు నిరసన తెలిపే సాహసం కూడా చేయలేదని ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.


అసలేం జరిగిందంటే.. ఇటీవల బాలికను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన ఉదంతం జలగావ్ జిల్లాను కుదిపేసింది. ఈ అంశంపై జర్నలిస్టు సందీప్‌ మహాజన్‌.. షిండేపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శను ఎమ్మెల్యే కిషోర్ పాటిల్ జీర్ణించుకోలేక.. నేరుగా జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో, జర్నలిస్టులు ఆడియో క్లిప్ గురించి పాటిల్‌ను ప్రశ్నించారు. ఆ ఆడియో క్లిప్ తనదేనని, జర్నలిస్టును దూషించింది తానేనని కూడా ఎమ్మెల్యే కిషోర్ బాహాటంగా ఒప్పుకున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×