E-Paper
Advertisement

Bank Account : అకౌంట్లో జీరో బ్యాలెన్స్.. రూ.35వేల కోట్లు వసూల్.. బీఅలర్ట్..

Bank Account : అకౌంట్లో జీరో బ్యాలెన్స్.. రూ.35వేల కోట్లు వసూల్.. బీఅలర్ట్..
Bank Account

Bank Account : గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ.35వేల కోట్లు వివిధ బ్యాంకులు కస్టమర్ల నుంచి కొల్లగొట్టాయి. మినిమమ్ బ్యాలెన్స్‌లు లేకపోవడంపై పెనాల్టీలు, అదనపు ఏటీఎం లావాదేవీలు, SMS సేవలపై ఛార్జీల రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్‌కు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ ఈ వివరాలను లిఖితపూర్వకంగా ప్రకటించారు.

HDFC, ICICI, IDBI వంటి ప్రైవేట్‌ బ్యాంకులతో పాటూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ మొత్తాన్ని ఖాతాదారుల నుంచి వసూలు చేశాయి. ఐదేళ్లలో చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తం 35వేల కోట్ల రూపాయల్లో.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకపోవడంపై విధించే చార్జీల రూపంలో అత్యధికంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఏకంగా 21వేల 44కోట్ల రూపాయలను వసూలు చేశాయి. అదనపు ఏటీఎం లావాదేవీల ఛార్జీల పేరిట 8వేల 289కోట్లు, SMS సేవల కోసం 6వేల 254 కోట్ల రూపాయలు వసూలు చేశాయి.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×