E-Paper
Advertisement

Bank Account : అకౌంట్లో జీరో బ్యాలెన్స్.. రూ.35వేల కోట్లు వసూల్.. బీఅలర్ట్..

Bank Account : అకౌంట్లో జీరో బ్యాలెన్స్.. రూ.35వేల కోట్లు వసూల్.. బీఅలర్ట్..
Advertisement
Bank Account

Bank Account : గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ.35వేల కోట్లు వివిధ బ్యాంకులు కస్టమర్ల నుంచి కొల్లగొట్టాయి. మినిమమ్ బ్యాలెన్స్‌లు లేకపోవడంపై పెనాల్టీలు, అదనపు ఏటీఎం లావాదేవీలు, SMS సేవలపై ఛార్జీల రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్‌కు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ ఈ వివరాలను లిఖితపూర్వకంగా ప్రకటించారు.

Advertisement

HDFC, ICICI, IDBI వంటి ప్రైవేట్‌ బ్యాంకులతో పాటూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ మొత్తాన్ని ఖాతాదారుల నుంచి వసూలు చేశాయి. ఐదేళ్లలో చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తం 35వేల కోట్ల రూపాయల్లో.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకపోవడంపై విధించే చార్జీల రూపంలో అత్యధికంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఏకంగా 21వేల 44కోట్ల రూపాయలను వసూలు చేశాయి. అదనపు ఏటీఎం లావాదేవీల ఛార్జీల పేరిట 8వేల 289కోట్లు, SMS సేవల కోసం 6వేల 254 కోట్ల రూపాయలు వసూలు చేశాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×