E-Paper
Advertisement

Kalamassery Blasts : కేరళ పేలుళ్ల కేసు.. నేనే బాధ్యుడినంటూ లొంగిపోయిన నిందితుడు

Kalamassery Blasts : కేరళ పేలుళ్ల కేసు.. నేనే బాధ్యుడినంటూ లొంగిపోయిన నిందితుడు
Advertisement

Kalamassery Blasts : కేరళ పేలుళ్ల కేసులో అనూహ్య పరిణామం జరిగింది. పేలుళ్లకు తానే బాధ్యుడిని అంటూ కేరళ పోలీసుల ముందు లొంగిపోయాడు ఓ వ్యక్తి. కేరళ ADGP ముందు లొంగిపోయిన అతడిని డొమినిక్ మార్టిన్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుడు కూడా పేలుడు జరిగిన చర్చికు సంబంధించిన వ్యక్తిగానే ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అయితే మిగతా విషయాలన్ని దర్యాప్తు జరిపాకే తెలుపుతామంటున్నారు పోలీసులు.

ఈ పేలుళ్లలో ఒకరు ఒకరు మృతిచెందగా, 36 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. లామస్సేరి నెస్ట్‌ సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఈ పేలుడు జరిగంది. అయితే ప్రస్తుతం లొంగిపోయిన మార్టిన్‌కు అసలు ఐఈడీ ఎక్కడి నుంచి వచ్చింది? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇప్పటికే టిఫిన్‌ బాక్స్‌లో ఐఈడీని తీసుకొచ్చి పేలుడు జరిపారని ప్రాథమికంగా నిర్ధారించారు కేరళ పోలీసులు.

Advertisement

మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే కేరళలో ల్యాండ్‌ అయ్యాయి. ఉగ్రవాద కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు ఇప్పటికే అనుమానిస్తున్నారు. NIA టీమ్‌ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఘటనకు మూలాలు గుర్తించేందుకు 8 మందితో కూడిన NSG టీమ్‌తో పాటు మరికొన్ని ఏజెన్సీలో కేరళకు చేరుకున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేరళ సీఎంకు ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీసారు.

ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ పేలుడు జరిగింది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 2 వేలకు పైగా వచ్చారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. పేలుడు సంభవించడంతో అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Advertisement

కేరళలో బాంబు పేలుడుతో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. కేరళలో కూడా హైఅలర్ట్ ప్రకటించి.. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో దేశ రాజధాని ఢిల్లీలో కూడా హైఅలర్ట్ ప్రకటించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×