Breaking news: తమిళనాడు రాష్ట్రంలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కరూర్ లో సినీ హీరో, టీవీకే పార్టీ చీఫ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 33 మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ
తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపు బాధితులను సీఎం పరామర్శించనున్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ రియాక్ట్ అయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
10 వేల మందికే పర్మిషన్
కరూర్ లో కార్నర్ సమావేశం నిర్వహించేందుకు టీవీకే పార్టీ పోలీసుల వద్ద అనుమతి తీసుకుంది. పోలీసులు 10 వేల మంది కోసమే అనుమతి ఇవ్వగా.. హీరో విజయ్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. దాదాపు 50 వేల మంది వరకు తరలి వచ్చినట్లు పలు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి . అంత మందికి సరిపడా స్థలం లేక తొక్కిసలాట జరిగినట్లు పలువురు చెబుతున్నారు. మృతులలో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు..
విజయ్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు.
విజయ్ సభలో ఇది రెండోసారి
TVK అధినేత చీఫ్ విజయ్ నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరగడం ఇది తొలిసారి కాదు.. గతంలో మధురైలో నిర్వహించిన సభలో కూడా తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఒక్కరు మృతి చెందగా.. 400 మంది అస్వస్థతకు లోనయ్యారు. కాగా ఈ రోజు నిర్వహించిన సభలో 33మంది మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సభకు ఊపిరి ఆడని విధంగా జనాలు వచ్చారని.. రక్షణ ఏర్పాట్లు సరిగా లేవని అక్కడకు వచ్చిన వారు చెబుతున్నారు.
🔴#BREAKING | கரூர் விஜயின் பிரச்சாரத்தின் போது ஏற்பட்ட கூட்ட நெரிசலில் சிக்கி 13 பேர் உயிரிழந்த நிலையில்
🔹சேலம், திருச்சி , நாமக்கல் உள்ளிட்ட அரசு மருத்துவமனைகளிலிருந்து மூத்த மருத்துவர்கள் மற்றும் மயக்கவியல் மருத்துவர்கள் கரூர் செல்லுமாறு முதலமைச்சர் அறிவுறுத்தல்
🔹கரூர்… pic.twitter.com/fp3uEjuZc6
— Spark Media (@SparkMedia_TN) September 27, 2025