E-Paper
Advertisement

Kamal Haasan Meets Kallakurichi Victims: కల్తీసారా బాధితులను పరామర్శించిన కమల్ హాసన్!

Kamal Haasan Meets Kallakurichi Victims: కల్తీసారా బాధితులను పరామర్శించిన కమల్ హాసన్!
Advertisement

Kamal Haasan Meets Kallakurichi Victims: తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపిన కల్తీ సారా బాధితులను మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ఆదివారం పరామర్శించారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులకు కమల్ భరోసా ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ దుర్ఘటనలో 56 మంది మృతి చెందనట్లు జిల్లా యంత్రాంగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని నాలుగు వేర్వేరు ఆసుపత్రుల్లో 216 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కల్లకురిచ్చి జిల్లాలోని కల్తీ సారా సరఫరా కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని కరుణాపురం గ్రామానికి చెందిన చిన్నదురై అనే వ్యక్తి కల్తీ లిక్కర్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కల్తీ సారా తాగిన బాధితులు ప్రతి రోజు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే రిటైర్డ్ జస్టిస్ గోకుల్ దాస్ కమిషన్ ఘటనపై దర్యాప్తు చేస్తోంది.

Advertisement

Also Read: అతిషి దీక్షపై ఢిల్లీ బీజేపీ చీఫ్ తీవ్ర విమర్శలు

మరో వైపు మూడు నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉంటే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×