E-Paper
Advertisement

5 Crore, 106 Kg Jewellery Seized: కర్ణాటకలో భారీగా డబ్బు.. ఆభరణాలు సీజ్.. ఎవరివి?

5 Crore, 106 Kg Jewellery Seized: కర్ణాటకలో భారీగా డబ్బు.. ఆభరణాలు సీజ్.. ఎవరివి?
Advertisement
Karnataka Police Seized Rs 5 CR Cash, 106 Kg of Jewellery in Pre Election 2024
Karnataka Police Seized Rs 5 CR Cash, 106 Kg of Jewellery in Pre Election 2024

5 Crore Cash, 106 Kg Jewellery Seized in Karnataka During the Elections 2024: సార్వత్రిక ఎన్నికల వేళ ధన ప్రవాహం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం భారీగా పోలీసులు, ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను నియమించినా డబ్బు పట్టుబడుతూనే ఉంది. తాజాగా కర్ణాటకలో దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు.

బళ్లారిలో స్థానిక హేమ జ్యూవెలర్స్ అధినేత నరేష్ సోనీ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో నగదు, నగలు పట్టుబడ్డాయి. దాదాపు 106 కిలోల ఆభరణాలు ఉన్నాయి. అందులో మూడు కేజీల గోల్డ్, 103 కేజీల సిల్వర్ ఉంది. అలాగే 68 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో వీటిని తీసుకొచ్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ భారీగా నగదు, నగలు పట్టుబడడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి మరింత నిఘా పెంచారు. బోర్డర్‌లో బలగాలను మొహరించారు. కర్ణాటకకు రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశ ఏప్రిల్ 26న కాగా, మే నాలుగున రెండో దశ పోలింగ్ జరగనుంది.

Also Read: Hemangi Sakhi: దేశ రాజకీయాల్లో సంచలనం.. మోదీపై పోటీకి సిద్ధమైన.. ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌..!

Advertisement

మరోవైపు కర్ణాటకలో సోదాలు ముమ్మరమయ్యాయి. కోలార్‌ పరిధిలోని ఓ కారులో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. 1200 జిలెటిన్ స్టిక్స్, 7 బాక్సుల వైర్లు, 6 డిటోనేటర్లను ఓ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×