E-Paper
Advertisement

Koo App Shut Down: కూ యాప్ క్లోజ్.. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో..

Koo App Shut Down: కూ యాప్ క్లోజ్.. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో..

Koo App to Shut Sown: దేశీయ సోషల్‌మీడియా కూ యాప్ మూతపడింది. యూజర్స్‌తో ఆ యాప్‌కు ఉన్న బంధం తెగింది. బుధవారం (నేటి) నుంచి ఈ యాప్ తన కార్యకలాపాలను మూసివేసింది. వివిధ కంపెనీలు కూ యాప్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాయి. చివరకు చర్చలు విఫలం కావడంతో మూసి వేయాలని నిర్ణయించుకున్నారు ఫౌండర్.

దేశీయ సోషల్ మీడియా యాప్ కూ.. ఇది ఎక్స్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించారు. కోట్లలో వినియోగదారులను కూడ బెట్టుకుంది. తక్కువ సమయంలో యూజర్స్‌ని బాగా పెంచుకుంది. తన కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆర్థిక సమస్యలు ఆ కంపెనీని చుట్టుముట్టాయి. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది.

ఈ ఏడాది లే ఆఫ్ ప్రకటించింది కూడా. అవేమీ కూ ఆదుకోలేకపోయాయి. కూ గురించి తెలుసుకున్న డైలీ హంట్ సహా పలు సంస్థలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాయి. అయితే చర్చలు విఫలం కావడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు కూ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్‌లో ఓ పోస్టు పెట్టారు.

Also Read: పానీ పూరీ.. బ్యాన్ విధించేందుకు కర్ణాటక, తమిళనాడు రెడీ!

2019లో కూ యాప్ ప్రారంభమైంది. దీన్ని అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా కలిసి ప్రారంభిం చారు. దీనికి రాధాకృష్ణ సీఈఓగా వ్యవహరించారు. రైతు ఉద్యమం సమయంలో కేంద్రంతో X కి ఘర్షణ నెలకొంది. ఆ సమయంలో కూ యాప్ బాగా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్రమంత్రులు స్వయంగా ఆత్మనిర్బర్ యాప్‌గా దీన్ని ప్రమోట్ చేశారు. అక్కువ సమయంలో ఆఫ్రికా, దక్షిణ అమెరికాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. చివరకు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కలేక మూతపడింది.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×