E-Paper
Advertisement

Koo App Shut Down: కూ యాప్ క్లోజ్.. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో..

Koo App Shut Down: కూ యాప్ క్లోజ్.. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో..
Advertisement

Koo App to Shut Sown: దేశీయ సోషల్‌మీడియా కూ యాప్ మూతపడింది. యూజర్స్‌తో ఆ యాప్‌కు ఉన్న బంధం తెగింది. బుధవారం (నేటి) నుంచి ఈ యాప్ తన కార్యకలాపాలను మూసివేసింది. వివిధ కంపెనీలు కూ యాప్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాయి. చివరకు చర్చలు విఫలం కావడంతో మూసి వేయాలని నిర్ణయించుకున్నారు ఫౌండర్.

దేశీయ సోషల్ మీడియా యాప్ కూ.. ఇది ఎక్స్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించారు. కోట్లలో వినియోగదారులను కూడ బెట్టుకుంది. తక్కువ సమయంలో యూజర్స్‌ని బాగా పెంచుకుంది. తన కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆర్థిక సమస్యలు ఆ కంపెనీని చుట్టుముట్టాయి. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది.

Advertisement

ఈ ఏడాది లే ఆఫ్ ప్రకటించింది కూడా. అవేమీ కూ ఆదుకోలేకపోయాయి. కూ గురించి తెలుసుకున్న డైలీ హంట్ సహా పలు సంస్థలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాయి. అయితే చర్చలు విఫలం కావడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు కూ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్‌లో ఓ పోస్టు పెట్టారు.

Also Read: పానీ పూరీ.. బ్యాన్ విధించేందుకు కర్ణాటక, తమిళనాడు రెడీ!

Advertisement

2019లో కూ యాప్ ప్రారంభమైంది. దీన్ని అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా కలిసి ప్రారంభిం చారు. దీనికి రాధాకృష్ణ సీఈఓగా వ్యవహరించారు. రైతు ఉద్యమం సమయంలో కేంద్రంతో X కి ఘర్షణ నెలకొంది. ఆ సమయంలో కూ యాప్ బాగా పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్రమంత్రులు స్వయంగా ఆత్మనిర్బర్ యాప్‌గా దీన్ని ప్రమోట్ చేశారు. అక్కువ సమయంలో ఆఫ్రికా, దక్షిణ అమెరికాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. చివరకు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కలేక మూతపడింది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×