E-Paper
Advertisement

Lalu Prasad Yadav: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. లాలూ కుటుంబానికి బిగ్ షాక్, ఎమైందంటే..?

Lalu Prasad Yadav: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. లాలూ కుటుంబానికి బిగ్ షాక్, ఎమైందంటే..?
Advertisement

Lalu Prasad Yadav: నవంబర్‌లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ న్యాయస్థానం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్ పై సోమవారం దిల్లీ కోర్టు అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో వీరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది

లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ లు కేటాయించడంలో అవకతవకలు జరిగాయని ప్రధాన ఆరోపణలు వచ్చాయి. రౌజ్ అవెన్యూ కోర్టు మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద లాలూ కుటుంబపై  అభియోగాలు నమోదు చేసింది. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ తన పదవిని దుర్వినియోగం చేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Advertisement

ALSO READ: NMMS Scholarship: విద్యార్థులకు శుభవార్త.. రూ.48వేల స్కాలర్ షిప్ ఈజీగా పొందండి, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

కాంట్రాక్టులను సుజాత హోటల్‌కు అప్పగించేందుకు బదులుగా, లాలూ యాదవ్ ఒక బినామీ కంపెనీ ద్వారా ఖరీదైన ప్రాంతంలో మూడు ఎకరాలు భూమిని లంచంగా పొందారని సీబీఐ పేర్కొంది.  ఈ వ్యవహారంపై సీబీఐ 2017లోనే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.  నిందితులపై అభియోగాలు మోపేందుకు తగిన సమాచారం ఉందని కోర్టుకు వెల్లడించగా.. లాలూ తరఫు న్యాయవాది ఆ వాదనను తోసిపుచ్చారు. కోర్టులో లాలూ, తేజస్వి తాము ఏ తప్పూ చేయలేదని పేర్కొనగా, రబ్రీ దేవీ అసలు ఈ కేసు తప్పుగా మోపబడినదని వాదించారు.

Advertisement

ALSO READ: IPS Puran Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య దారుణం.. ఛండీగడ్‌లో డిప్యూటీ సీఎం భట్టి

బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ కూటమికి, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్ బంధస్ కూటమికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారం కీలక దశలో ఉన్న ఈ సమయంలో అవినీతి కేసులో కోర్టు ఆదేశాలు లాలూ కుటుంబానికి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఈ పరిణామం ప్రత్యర్థి పార్టీలకు తమ ప్రచారంలో లాలూ కుటుంబంపై విమర్శలు చేసేందుకు ఒక అవకాశంగా మారింది.

Related News

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

Big Stories

Advertisement
×