E-Paper
Advertisement

Karur Stampede: టీవీకే పంతం నెగ్గింది.. కరూర్‌ తొక్కిసలాట ఘటన సీబీఐ చేతికి.. సుప్రీంకోర్టు ఆదేశం

Karur Stampede: టీవీకే పంతం నెగ్గింది.. కరూర్‌ తొక్కిసలాట ఘటన సీబీఐ చేతికి.. సుప్రీంకోర్టు ఆదేశం

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో సీబీఐ విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను నియమించింది.

కరూర్ ఘటన సీబీఐ చేతికి

తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో సెప్టెంబర్ 27న టీవీకె పార్టీ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. కనీసం 60 మందికి పైగానే గాయపడ్డారు. విజయ్ ర్యాలీ కోసం దాదాపు 10 వేల మంది సామర్థ్యం ఉన్న వేదిక వద్దకు దాదాపు 30 వేల గుమిగూడడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు.

మధ్యాహ్నం సమయంలో రావాల్సిన టీవీకే అధినేత విజయ్.. సాయంత్రం 7.40 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నాడు. వేలాది మంది గంటల తరబడి ఎండలో ఉండడంతో తగినంత ఆహారం, తాగునీరు లేకుండా వేచి చూశారు. ఆయనను చూసేందుకు జనం వేదిక వైపు పరుగులు తీస్తుండగా బారికేడ్ల దగ్గర తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. మహిళలు, పిల్లలు సహా అనేక మంది మరణించారు.

మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు

భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని, ఆహారం-తాగునీటికి సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమైందని అధికారులు తేల్చారు. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.  ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై కేసులు నమోదు అయ్యాయి. వెంటనే టీవీకే పార్టీ హైకోర్టు తలుపు తట్టింది. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలు చేసింది. మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది.

ఈ ఘటనపై అధికార-విపక్షాల మధ్య మాటలు యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో టీవీకే పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆ పిటిషన్ సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతీనెలా కేసు దర్యాప్తు గురించి వివరాలు న్యాయస్థానానికి సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

ALSO READ: బతికుండగానే చితిపైకి పెద్దాయన.. జరిగినదంతా కళ్లతో చూశాడు

సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను నియమించింది. ఈ కమిటీలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉంటారు. వారు తమిళనాడు కేడర్‌కు చెందినవారు కావచ్చు, కాకపోవచ్చు. ఈ ఘటనపై స్వయంగా సీబీఐ రంగంలోకి దిగడంతో నేతల ఆరోపణలకు బ్రేకులు పడ్డాయి.

ఇదిలా ఉండగా తమిళనాడులో కరూర్ తొక్కిసలాట ఘటనపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కరూర్ తొక్కిసలాటకు డీఎంకే పార్టీ మాజీ నేత సెంథిల్ బాలాజీనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్. పథకం ప్రకారమే ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగేలా చేశారని, అందువల్లే 41 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు గుప్పించారు.

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్నారు. జనవరి 10 తర్వాత కూటమి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు నాగేంద్రన్.

 

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×