E-Paper
Advertisement

Team India Zimbabwe Tour: ఆ ముగ్గురూ లేకుండానే.. జింబాబ్వే బయలుదేరిన యువ జట్టు

Team India Zimbabwe Tour: ఆ ముగ్గురూ లేకుండానే.. జింబాబ్వే బయలుదేరిన యువ జట్టు

Young Team India for Zimbabwe Tour: టీ 20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియా ఆటగాళ్లు రాకుండానే జింబాబ్వే పర్యటనకు భారత యువ జట్టు బయలుదేరింది. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ ఆధ్వర్యంలో శుభ్ మన్ గిల్ నాయకత్వంలో తొలి బృందం బయలుదేరింది. జింబాబ్వేలో జులై 6 నుంచి 5 టీ ట్వంటీల సిరీస్ ప్రారంభం కానుంది.

అయితే బార్బడోస్ లో భీకర తుఫాను తాకిడితో ఇండియాకి తిరిగి రావడం ఆలస్యమైన భారత జట్టులో ముగ్గరు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. వారిలో సంజూ శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైశ్వాల్ ఉన్నారు. ప్రస్తుతం వీరి స్థానంలో మొదటి రెండు మ్యాచ్ లకు సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకున్నారు. వికెట్‌ కీపర్‌గా జితేశ్ శర్మను ఎంపిక చేసిన బీసీసీఐ.. ఇషాన్‌ కిషన్‌ను పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.

జింబాబ్వే పర్యటనలో జులై 6న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జూలై 7, జులై 10, 13, 14 తేదీల్లో మగతా నాలుగు టీ 20 మ్యాచులు జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతాయి.

Also Read: స్వదేశానికి టీమిండియా.. రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న రోహిత్ సేన

భారత్ లో ప్రపంచకప్‌ విజయోత్సవ సంబరాలు కూడా ఉండటంతో సంజూ శాంసన్‌, శివమ్ దూబె, యశస్వి జైశ్వాల్ బహుశా జులై 7వరకు ఆగనున్నారు. అయితే జులై 10న మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది.  ఆ సమయానికి వీరు జింబాబ్వే బయలుదేరి టీమిండియాతో కలిసే అవకాశాలున్నాయి.

Tags

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×