E-Paper
Advertisement

YS Jagan: నకిలీ మద్యం, నకిలీ బీరు.. జగనూ! ఇదంతా నువ్వు చేసిందే కదయ్యా!

YS Jagan: నకిలీ మద్యం, నకిలీ బీరు.. జగనూ! ఇదంతా నువ్వు చేసిందే కదయ్యా!
Advertisement

సంపూర్ణ మద్య నిషేధం..
విడతలవారీ మద్యపాన నిషేధం.
మద్యపాన నిషేధం కాదు, మద్యపాన నియంత్రణ.
ఇదీ జగన్ హయాంలో మనం విన్నది, కన్నది. నేను విన్నాను, నేను ఉన్నానంటూ వచ్చిన జగన్ మద్యపాన నిషేధాన్ని నియంత్రణగా మార్చి, ఎలాంటి జిమ్మిక్కులు చేశారో అందరం చూశాం. అమ్మఒడికి నాన్నబుడ్డితో చెల్లు అని చంద్రబాబు చేసిన సూటి విమర్శలు కూడా బాగానే పనిచేసి 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. మరిప్పుడు వైసీపీ వాళ్లు నకిలీ మద్యం, నకిలీ బీరు అంటూ సోషల్ మీడియా పోస్టింగ్ లు పెడుతుంటే జనం ఊరుకుంటారా? అప్పట్లో జగన్ మద్యాన్ని నిషేధించి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా అంటున్నారు కొంతమంది నెటిజన్లు. వైసీపీ విమర్శల్ని వారికే తిప్పికొడుతున్నారు.

మాట ఎందుకు తప్పారు?
నవరత్నాలన్నీ అమలు చేసినా మాకు తిరిగి అధికారం రాలేదు ఎందుకని అంటూ జగన్ పదే పదే ప్రశ్నిస్తుంటారు. అసలు నవరత్నాల్లో జగన్ నికార్సుగా ఎన్ని అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు తప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ కబుర్లు చెప్పి తర్వాత ఎందుకు మాట తప్పారు? ఇవన్నీ ప్రతిపక్షాలు అడుగుతున్నవి కాదు, సామాన్య ప్రజలు అడిగే ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పలేక కొన్నిరోజులు చంద్రబాబుని ప్రజలు గుడ్డిగా నమ్మారని విమర్శించారు, మరికొన్ని రోజులు నెపం ఈవీఎంలపైకి నెట్టారు.. ఇలా రకరకాలుగా తమని తాము సమర్థించుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపించేందుకంటూ నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు.

Advertisement

జనం నమ్ముతారా?
జగన్ హామీలను అమలు చేసినట్టే, చంద్రబాబు కూడా అన్నిట్నీ అమలు చేస్తున్నారు. ఆయన మద్యపాన నిషేధం చేయలేదు, ఈయన మహిళలకు నెల నెలా ఆర్థిక సాయంపై కాస్త గడువు కోరుతున్నారు. అంటే సూపర్ సిక్స్ విషయంలో జగన్ విమర్శించడానికేం లేదు. అందుకే కొత్తగా మెడికల్ కాలేజీలు, నకిలీ మద్యం అంటూ కొత్త రూట్ ఎంచుకున్నారు. నకిలీ మద్యం గురించి అడిగే అర్హత అసలు జగన్ కి కానీ, వైసీపీ నేతలకు కానీ ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధం విషయంలో పూర్తిగా మాట తప్పిన జగన్, అసలు తాను నిషేధం అనలేదని, నియంత్రణ అని మాత్రమే అన్నానంటూ అబద్ధాలు మొదలు చెప్పారని కూడా ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు నకిలీ మద్యం అంటూ రోడ్డెక్కుతుండటం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధం గురించి వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని అంటున్నారు. పోనీ వైసీపీ అధికారంలోకి వస్తే ఈసారయినా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పగలరా అని నిలదీస్తున్నారు.

Advertisement

Also Read: ‘జగన్ కోసం’ నారా లోకేష్ సాయం..

జగన్ హయాంలో కూడా నకిలీ లిక్కర్ కేసులు బయటపడ్డాయి. కనీసం నాడు కేసులు పెట్టడానికి కూడా ప్రభుత్వం ఇష్టపడలేదు. అసలు కల్తీ జరగలేదని చెప్పుకొచ్చారు. కానీ కూటమి హయాంలో తప్పుడు వ్యవహారం బయటపడిన తర్వాత ప్రభుత్వమే కేసులు పెట్టింది. టీడీపీ నుంచి కొందరు నేతల్ని సస్పెండ్ చేశారు కూడా. అంటే వైసీపీ కంటే కూటమి ప్రభుత్వం గొప్ప పనే చేసింది కదా అని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Also Read: కర్నూలు సభలో మోదీ ఆ ఒక్క పని చేయగలరా?

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×