E-Paper
Advertisement

Sharad Pawar: లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయం: శరద్ పవార్

Sharad Pawar: లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయం: శరద్ పవార్
Advertisement

Sharad Pawar: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనేది కాంగ్రెస్ నిర్ణయిస్తుందని ఎస్పీ నేత శరద్ పవార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమిలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీకి చెందిన నేతకు లోక్ సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయని.. ఈ నేపథ్యంలోనే ఎవరు ప్రతిపక్షహోదాలో ఉంటారనే దానిపై ఆ పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఆ తర్వాత అందుకు కూటమి సభ్యుల ఆమోదం కూడా అవసరమని తెలిపారు.

జూన్ 24 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు. లోక్ సభ సమావేశాలకు ముందు ఇండియా కూటమి సమావేశాన్ని నిర్వహించి లోక్‌సభ ప్రతిపక్ష నేతను ఎన్నుకుంటుందని తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించే అవకాశం లేదని తెలిపారు. ఈ సందర్భంగా శరద్ పవార్ బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. మోడీ హామీలపై ప్రజలు అవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు.

Advertisement

Also Read: వ్వవస్థలను బీజేపీ కబ్జా చేయడం వల్లే పేపర్ లీకేజీలు: రాహుల్ గాంధీ

మహారాష్ట్రలో అక్టోబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 288 సీట్లకు గానూ కనీసం 155 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 48 స్థానాలకు గానూ ఎంవీఏ మిత్ర పక్షాలు 31 సీట్లు గెలుచుకున్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 155 పైగా సీట్లను గెలుస్తామని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమీవేశాల తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలిపారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×