BigTV English

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణం.. తాంత్రికుడి దెబ్బలకు మహిళ బలి..

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణం.. తాంత్రికుడి దెబ్బలకు మహిళ బలి..

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ తాంత్రికుడి ఇనుప గొలుసు దెబ్బలకు తాళలేక 34 ఏళ్ల మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజితకు 15 ఏళ్ల క్రితం ప్రకాష్ దామోర్‌ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. 15 ఏళ్లు గడిచినా ఆమెకు సంతానం కలగకపోవడంతో అత్తమామలు, తల్లిదండ్రులు తమ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లారు.


ఆమెకు దెయ్యం పట్టిందని తాంత్రికుడు భూతవైద్యం మొదలుపెట్టాడు. తంత్ర ప్రక్రియలో భాగంగా ఆమెను ఇనుప గొలుసులతో కొట్టడం మొదలుపెట్టాడు. దెబ్బలు తాళలేక మూడో రోజు మంజిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మధ్యమార్గంలోనే మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

అయితే మృతదేహంపై కొట్టిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ మరణానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదని వైద్యులు అన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఝబువా ఎస్పీ అగమ్ జైన్ తెలిపారు.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×