BigTV English

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణం.. తాంత్రికుడి దెబ్బలకు మహిళ బలి..

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో దారుణం.. తాంత్రికుడి దెబ్బలకు మహిళ బలి..

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ తాంత్రికుడి ఇనుప గొలుసు దెబ్బలకు తాళలేక 34 ఏళ్ల మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజితకు 15 ఏళ్ల క్రితం ప్రకాష్ దామోర్‌ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. 15 ఏళ్లు గడిచినా ఆమెకు సంతానం కలగకపోవడంతో అత్తమామలు, తల్లిదండ్రులు తమ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లారు.


ఆమెకు దెయ్యం పట్టిందని తాంత్రికుడు భూతవైద్యం మొదలుపెట్టాడు. తంత్ర ప్రక్రియలో భాగంగా ఆమెను ఇనుప గొలుసులతో కొట్టడం మొదలుపెట్టాడు. దెబ్బలు తాళలేక మూడో రోజు మంజిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మధ్యమార్గంలోనే మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

అయితే మృతదేహంపై కొట్టిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ మరణానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదని వైద్యులు అన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఝబువా ఎస్పీ అగమ్ జైన్ తెలిపారు.


Related News

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

Big Stories

×