E-Paper
Advertisement

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు తప్పిన ప్రమాదం..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు తప్పిన ప్రమాదం..
Advertisement

Eknath Shinde helicopter escape: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గురువారం మధ్యాహ్నం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పైలట్ ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి.. అప్రమత్తత కారణంగా ఒక పెద్ద ముప్పు తప్పింది. జుహులోని పవన్ హన్స్ హెలిప్యాడ్‌లో హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అధికారులు.. పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం షిండేతో పాటు విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారని షిండే కార్యాల‌యం పేర్కొంది.

తన పార్టీ కార్యకర్త కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు షిండే ముంబై నుంచి ముర్బాద్‌కు ప్రయాణిస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు మహాలక్ష్మి రేస్‌కోర్స్ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే ఐరోలి పరిసర ప్రాంతాలకు చేరుకోగానే వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించాయి. గాలిలో తీవ్రమైన తుఫాను ఏర్పడటాన్ని పైలట్ గుర్తించారు.

Advertisement

ముందుకు వెళ్లడం ప్రమాదకరమని భావించిన పైలట్ వెంటనే విషయాన్ని డిప్యూటీ సీఎంకి వివరించారు. ఆ ముప్పును పసిగట్టి ప్రయాణాన్ని కొనసాగించకుండా వెనక్కి మళ్లాలని సూచించారు. షిండే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పైలట్ చాకచక్యంగా హెలికాప్టర్ మార్గాన్ని మార్చి.. కొద్ది నిమిషాల్లోనే పవన్ హన్స్ హెలిప్యాడ్‌లో సురక్షితంగా దించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే హెలికాప్టర్ తన నిర్దేశిత మార్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని విమానయాన వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం ఉందా లేక కేవలం వాతావరణ పరిస్థితులే కారణమా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. తన ప్రాణాలకు ముప్పు తప్పినప్పటికీ.. షిండే తన పర్యటనలో మార్పులు చేసుకుని రోడ్డు మార్గంలో వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

Read Also: తమిళ రాజకీయంలో ‘దళపతి’ మార్క్ వ్యూహం.. సొంత మీడియా వైపు విజయ్ అడుగులు?

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×