E-Paper
Advertisement

Madhya Pradesh : దేవాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. మధ్యప్రదేశ్‌‌లో కలకలం..

Madhya Pradesh : దేవాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. మధ్యప్రదేశ్‌‌లో కలకలం..

Madhya Pradesh : దేవాలయంలో ఓ భక్తుడు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని మహర్‌ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. దేవాలయంలో మృతి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాకు చెందిన లల్లారామ్‌(37)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహర్‌ జిల్లా కేంద్రంలోని ఓ కొండపై శారదా మాతా దేవాలయం ఉంది. సోమవారం రాత్రి లల్లారామ్‌ ఒంటిరిగా దేవాలయనికి చేరుకుని.. తన వద్ద ఉన్న కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దేవాలయంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడున్న పరిస్థితుల ఆధారంగా లల్లారామ్ గొంతు కోసుకొని బలవన్మరణం చెందినట్లు నిర్ధారించారు. అయితే ఈ ఘటనను ఎవరూ గమణించలేదని మహర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి అనిమేష్‌ ద్వివేది తెలిపారు.

దేవాలయంలో అతడు పడి ఉన్న కొంచెం దూరంలో కత్తిని గుర్తించామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.ఈ దేవాలయంలో గతంలో కొందరు భక్తులు తమ నాలుకను కోసుకునేందుకు కూడా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ దేవాలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని స్థానికులు పేర్కొన్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×