BigTV English

Madhya Pradesh : దేవాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. మధ్యప్రదేశ్‌‌లో కలకలం..

Madhya Pradesh : దేవాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. మధ్యప్రదేశ్‌‌లో కలకలం..

Madhya Pradesh : దేవాలయంలో ఓ భక్తుడు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని మహర్‌ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. దేవాలయంలో మృతి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాకు చెందిన లల్లారామ్‌(37)గా గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహర్‌ జిల్లా కేంద్రంలోని ఓ కొండపై శారదా మాతా దేవాలయం ఉంది. సోమవారం రాత్రి లల్లారామ్‌ ఒంటిరిగా దేవాలయనికి చేరుకుని.. తన వద్ద ఉన్న కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దేవాలయంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడున్న పరిస్థితుల ఆధారంగా లల్లారామ్ గొంతు కోసుకొని బలవన్మరణం చెందినట్లు నిర్ధారించారు. అయితే ఈ ఘటనను ఎవరూ గమణించలేదని మహర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి అనిమేష్‌ ద్వివేది తెలిపారు.


దేవాలయంలో అతడు పడి ఉన్న కొంచెం దూరంలో కత్తిని గుర్తించామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.ఈ దేవాలయంలో గతంలో కొందరు భక్తులు తమ నాలుకను కోసుకునేందుకు కూడా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ దేవాలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని స్థానికులు పేర్కొన్నారు.

Related News

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Big Stories

×