E-Paper
Advertisement

Maoist Surrender: మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

Maoist Surrender: మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

Maoist surrender: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన దంతేవాడ జిల్లాలో.. 37 మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటు ఎస్పీ సమక్షంలో జరిగింది. వారిలో 27 మందిపై గతంలో ప్రభుత్వం రూ.65 లక్షల రివార్డు ప్రకటించింది. అలాగే వారిలో 12 మంది మహిళా మావోయిస్టులు ఉండడం విశేషం.

ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి లొంగుబాటు జరగడం భద్రతా వర్గాల్లో సంచలనం సృష్టించింది. గత కొద్ది నెలలుగా భద్రతా బలగాల ఒత్తిడి పెరగడం, అడవుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడంతో.. ఆపరేషన్లు కొనసాగడం వల్లే ఈ స్థాయిలో లొంగుబాటు సాధ్యమైందని అధికారులు అంచనా వేస్తున్నారు. 27 మందిపై రూ.65 లక్షల రివార్డు ప్రకటించింది.

లొంగిపోయిన 27 మందిపై గతంలో భారీ రివార్డులు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో పలువురు భద్రతా బలగాలపై జరిగిన దాడులు, ఐఈడీ పేలుళ్లు, పౌరుల హత్యలు వంటి కీలక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కొందరు ప్రాంతీయ కమాండర్ల కింద పనిచేసినట్లు అధికారులు గుర్తించారు.

Also Read: యూకేలో దారుణం: భారత విద్యార్థిపై కత్తులతో దాడి.. చికిత్స పొందుతూ మృతి!

మొత్తంగా చూస్తే, ఛత్తీస్‌గఢ్‌లో 37 మంది మావోయిస్టుల సమూహ లొంగుబాటు రాష్ట్ర భద్రతా పరిస్థితుల్లో కీలక మలుపుగా మారింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది మావోయిస్టులు ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశముందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×