E-Paper
Advertisement

Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు..11 మంది మృతి

Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు..11 మంది మృతి

Fire Accidents : దేశంలోని మహానగరాల్లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ముంబై, అమృత్‌సర్‌తోపాటు కాన్పూర్‌లోనూ భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ముంబై ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. అమృత్‌సర్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

అమృత్‌సర్‌ లోని ఓ ఫార్మాస్యూటికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయనాలు పెద్ద ఎత్తున ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ అగ్ని ప్రమాదంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా.. ప్రమాదంలో ఫ్యాక్టరీలోని లక్షలాది రూపాయల విలువైన యంత్రాలు దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.

యూపీలోని కాన్పూర్‌ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్మీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ గోదాం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×