E-Paper
Advertisement

Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు..11 మంది మృతి

Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు..11 మంది మృతి
Advertisement

Fire Accidents : దేశంలోని మహానగరాల్లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ముంబై, అమృత్‌సర్‌తోపాటు కాన్పూర్‌లోనూ భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ముంబై ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. అమృత్‌సర్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

అమృత్‌సర్‌ లోని ఓ ఫార్మాస్యూటికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయనాలు పెద్ద ఎత్తున ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ అగ్ని ప్రమాదంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా.. ప్రమాదంలో ఫ్యాక్టరీలోని లక్షలాది రూపాయల విలువైన యంత్రాలు దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.

Advertisement

యూపీలోని కాన్పూర్‌ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్మీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ గోదాం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×