E-Paper
Advertisement

Measles: మళ్లీ పెరిగిన మీజిల్స్‌.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు మృతి..

Measles: మళ్లీ పెరిగిన మీజిల్స్‌.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు మృతి..
Advertisement

Measles Spreads In MP

Measles Spreads In MP: మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో ఇద్దరు పిల్లలు మీజిల్స్‌తో మరణించారు. 17 మంది వ్యాధి బారిన పడ్డారు. మీజిల్స్‌ కేసులు రోజురోజుకు పెరగతున్నాయి. దీంతో ఎనిమిది గ్రామాల్లోని అన్ని పాఠశాలలను 3 రోజుల పాటు మూసివేయాలని అధికారులను నిర్ణయించారు.

Advertisement

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2022 సంవత్సరంలో భారతదేశంలో 11 లక్షల మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ వేసుకోలేదు అని అంచనా వేశారు. గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇద్దరు పిల్లలు ఈ వ్యాధితో మరణించారు.

మీజిల్స్ ఒకరి నుంచి మరోకరికి వెంటనే వ్యాపించే అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైర జ్వరంతో పాటు దద్దుర్లు వస్తాయి. మీజిల్స్ ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

Advertisement

Read More: బిజేపీలో మోదీ వారసుడెవరు?.. 2024 ఎన్నికల తరువాత బిజేపీ 3.0 ఎలా ఉండబోతోంది?

కళ్ళు ఎర్రబడటం, నోటిలో తెల్లటి మచ్చలు రావడం. శరీరమంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలతో ఈ వ్యాధి మొదలైతోంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ఇది సాధారణంగా 10 నుంచి 14 రోజులు పాటు ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.

మీజిల్స్‌తో బారిన పడినవారు ఇంట్లోనే ఉండటం మంచిది. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం మంచిది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వాడకం పెరిగినప్పటికీ.. సంవత్సరానికి రెండు లక్షలకు పైగా పిల్లలు ఇప్పటికీ మీజిల్స్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×