E-Paper
Advertisement

Measles: మళ్లీ పెరిగిన మీజిల్స్‌.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు మృతి..

Measles: మళ్లీ పెరిగిన మీజిల్స్‌.. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు మృతి..

Measles Spreads In MP

Measles Spreads In MP: మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో ఇద్దరు పిల్లలు మీజిల్స్‌తో మరణించారు. 17 మంది వ్యాధి బారిన పడ్డారు. మీజిల్స్‌ కేసులు రోజురోజుకు పెరగతున్నాయి. దీంతో ఎనిమిది గ్రామాల్లోని అన్ని పాఠశాలలను 3 రోజుల పాటు మూసివేయాలని అధికారులను నిర్ణయించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2022 సంవత్సరంలో భారతదేశంలో 11 లక్షల మంది పిల్లలు మీజిల్స్ వ్యాక్సిన్ మొదటి డోస్‌ వేసుకోలేదు అని అంచనా వేశారు. గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇద్దరు పిల్లలు ఈ వ్యాధితో మరణించారు.

మీజిల్స్ ఒకరి నుంచి మరోకరికి వెంటనే వ్యాపించే అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారికి తీవ్రమైర జ్వరంతో పాటు దద్దుర్లు వస్తాయి. మీజిల్స్ ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

Read More: బిజేపీలో మోదీ వారసుడెవరు?.. 2024 ఎన్నికల తరువాత బిజేపీ 3.0 ఎలా ఉండబోతోంది?

కళ్ళు ఎర్రబడటం, నోటిలో తెల్లటి మచ్చలు రావడం. శరీరమంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలతో ఈ వ్యాధి మొదలైతోంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ఇది సాధారణంగా 10 నుంచి 14 రోజులు పాటు ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.

మీజిల్స్‌తో బారిన పడినవారు ఇంట్లోనే ఉండటం మంచిది. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం మంచిది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వాడకం పెరిగినప్పటికీ.. సంవత్సరానికి రెండు లక్షలకు పైగా పిల్లలు ఇప్పటికీ మీజిల్స్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×