E-Paper
Advertisement

PM Modi Tejas | తేజస్‌ ఫైటర్‌‌లో మోదీ ప్రయాణం.. తొలి ప్రధానిగా చరిత్ర!

PM Modi Tejas | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పైలట్ అవతారమెత్తారు. అది కూడా సాధారణ విమాన పైలట్ కాదు.. యుద్ధ విమాన పైలట్‌గా. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ డెవలప్ చేసిన తేజస్‌ ఫైటర్‌ జెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు. తేజస్‌లో ప్రయాణించేందుకు ఆయన పూర్తిగా యుద్ధ విమాన పైలట్ వేషధారణలో కనిపించారు.
ఇలా ఒక యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాన మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు.

PM Modi Tejas | తేజస్‌ ఫైటర్‌‌లో మోదీ ప్రయాణం.. తొలి ప్రధానిగా చరిత్ర!

PM Modi Tejas | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పైలట్ అవతారమెత్తారు. అది కూడా సాధారణ విమాన పైలట్ కాదు.. యుద్ధ విమాన పైలట్‌గా. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ డెవలప్ చేసిన తేజస్‌ ఫైటర్‌ జెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించారు. తేజస్‌లో ప్రయాణించేందుకు ఆయన పూర్తిగా యుద్ధ విమాన పైలట్ వేషధారణలో కనిపించారు.
ఇలా ఒక యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాన మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు.

బెంగుళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్ కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఫైటర్‌ జెట్‌లో ప్రయాణించారు. అంతకుముందు ర‌క‌ర‌కాల ఫైట‌ర్ జెట్ల త‌యారీ గురించి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. తేజ‌స్ త‌యారీ గురించి కూడా ఆయ‌న తెలుసుకున్నారు.

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ.. తేజ‌స్ యుద్ధ విమానాల‌ను త‌యారు చేస్తున్నది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉంది. తేజ‌స్ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్ల‌ను హెచ్ఏఎల్ ఉత్పత్తి చేస్తోంది.

తేజ‌స్ యుద్ధ విమానంలో స‌క్సెస్‌ఫుల్‌గా ప్రయాణించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేశారు. ఈ ఎక్స్‌పిరియన్స్‌ అద్భుతంగా ఉందంటూ రాసుకొచ్చారు. స్వదేశీ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌న్న త‌న న‌మ్మకానికి బ‌లం చేకూరిన‌ట్లు ఉంద‌న్నారు. భార‌త స‌త్తా ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×