E-Paper
Advertisement

Modi : ప్రపంచం చూపు భారత్‌ బడ్జెట్‌ వైపు.. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ : మోదీ

Modi : ప్రపంచం చూపు భారత్‌ బడ్జెట్‌ వైపు.. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ : మోదీ

Modi : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కీలక విషయాలు వెల్లడించారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం రోజే ఆర్థిక ప్రపంచంలోని విశ్వసనీయ వర్గాల నుంచి సానుకూల సందేశాలు వెలువడ్డాయని తెలిపారు. ఆర్థిక అనిశ్చితుల వేళ ప్రపంచం మొత్తం భారత్‌ బడ్జెట్‌ వైపు చూస్తోందన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభల తొలి ప్రసంగం మహిళలకు గర్వకారణంగా నిలుస్తోందన్నారు. ఈ అవకాశం భారత రాజ్యాంగం ఇచ్చే గౌరవంగా పేర్కొన్నారు. ఆదివాసీలకు, మహిళలకు ఇచ్చే గౌరవమని చెప్పారు.
దేశ ఆర్థికమంత్రి కూడా మహిళే అని గుర్తు చేశారు.

పార్లమెంట్ సమావేశాలల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నానని మోదీ స్పష్టం చేశారు. సమావేశాలు
సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరారు. విపక్షాలు తమ అభిప్రాయాల్ని సభలో వ్యక్తపరచాలని సూచించారు. బడ్జెట్ పైనా ప్రధాని మోదీ ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని తెలిపారు. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ సూత్రాన్ని ముందుకు తీసుకువెళతామని మోదీ స్పష్టం చేశారు.

మోదీ చెప్పిన అంశాలను పరిశీలిస్తే బడ్జెట్ లో ఆత్మనిర్భర్ భారత్ కు పెద్దపీట వేస్తారని అర్థమవుతోంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంటుందన్నారు. అంటే వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మధ్యతరగతి, పేదలను దృష్టి పెట్టుకుని బడ్జెట్ రూపొందించారని స్పష్టమవుతోంది. సామాన్యులపై భారీగా వరాలు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వేతన జీవులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న విధంగా పన్నులు స్లాబులు మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరి అన్నివర్గాల ప్రజలు సంతృప్తి చెందేలా బడ్జెట్ ఉంటుందా? కార్పొరేట్ కంపెనీలకే మోదీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చుతుందని పదేపదే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొట్టే చర్యలు మోదీ ప్రభుత్వం చేపట్టిందా? ఆ దిశగా బడ్జెట్ లో సామాన్యుల అవసరాలకు, అవకాశాలకు పెద్దపీట వేశారా? చూడాలి మరి.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×