E-Paper
Advertisement

Modi : బందీపూర్ టైగర్ రిజర్వులో మోదీ సందడి.. ఫోటోలు వైరల్..

Modi : బందీపూర్ టైగర్ రిజర్వులో మోదీ సందడి.. ఫోటోలు వైరల్..
Advertisement

Modi : ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని బందీపూర్ టైగర్‌ రిజర్వును సందర్శించారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించిన మోదీ ఉత్సాహంగా ఈ టైగర్‌ రిజర్వులో 20 కిలోమీటర్లు ప్రయాణించారు. అటవీ అందాలను ఆస్వాదించారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

తెప్పకాడు ఎలీఫ్యాంట్ క్యాంప్‌ వద్ద ప్రధాని ఏనుగులకు చెరకుగడలను ఆహారంగా అందించారు. ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్న ‘ఎలిఫెంట్ విష్పరర్స్‌’ డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్‌, బెళ్లి దంపతులు, నిర్మాత, దర్శకుడు, మావటిలతో ముచ్చటించారు.

Advertisement

రాచనగరిలోని కర్ణాటక సార్వత్రిక విశ్వ విద్యాలయంలో ఆదివారం నిర్వహించే పులుల బందీపూర్ అభయారణ్యం- టైగర్‌ ప్రాజెక్టు సువర్ణ మహోత్సవాలను ప్రారంభించేందుకు శనివారం రాత్రే ప్రధాని మోదీ మైసూరుకు చేరుకొన్నారు. ప్రాజెక్ట్‌ టైగర్‌కు 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

బందీపూర్ టైగర్ రిజర్వు ఫొటోలను మోదీ ట్విటర్ లో పోస్ట్ చేశారు. “రమణీయమైన బందీపూర్ టైగర్‌ రిజర్వులో ఉదయం గడిపాను. దేశ ప్రకృతి సౌందర్యాన్ని, వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఆస్వాదించాను’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×