PUBG: ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు, లోకాన్ని మరిచిపోయేలా చేస్తున్నాయి ఆన్లైన్ గేమ్లు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరఠ్లో చోటుచేసుకున్న విషాద ఘటన గేమర్లందరినీ ఉలిక్కిపడేలా చేసింది. మహమ్మద్ కైఫ్ అనే 22 ఏళ్ల యువకుడు గత నాలుగు నెలలుగా పబ్జీ (PUBG) గేమ్కు విపరీతంగా బానిసయ్యాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గంటల తరబడి ఫోన్కే అతుక్కుపోవడం అతని దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఇది కేవలం ఆట మాత్రమే అనుకున్న అతనికి, అది ప్రాణాలనే హరిస్తుందని ఊహించలేకపోయాడు.
శుక్రవారం అర్ధరాత్రి వేళ, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి హెడ్ ఫోన్స్ పెట్టుకుని కైఫ్ ఆటాలో మునిగిపోయాడు. గెలుపు కోసం ఆరాటం, ప్రత్యర్థులపై పైచేయి సాధించాలనే తపన అతడిలో తెలియకుండానే విపరీతమైన మానసిక ఒత్తిడిని (Mental Pressure) పెంచేసింది. ఆ ఆవేశంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన కైఫ్ను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రాణాలను కాపాడలేకపోయారు.
వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, కైఫ్ చనిపోవడానికి ప్రధాన కారణం విపరీతమైన రక్తపోటు. ఆట ఆడుతున్నప్పుడు కలిగిన ఉద్వేగం వల్ల అతని బీపీ (Blood Pressure) 300 దాటిపోయింది. అంతటి తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక మెదడులోని సున్నితమైన నరాలు చిట్లిపోయాయి (Brain Hemorrhage). లోపల రక్తస్రావం కావడంతో క్షణాల్లోనే ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆరోగ్యవంతుడైన యువకుడు ఇలా కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
ఈ ఘటన ఆన్లైన్ గేమింగ్ పట్ల ఉన్న మోజును మరోసారి చర్చనీయాంశం చేసింది. వర్చువల్ ప్రపంచంలో గెలుపు కోసం పడే తాపత్రయం, శరీరంలోని నాడీ వ్యవస్థపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతుందో ఇది నిరూపిస్తోంది. నిరంతరం గేమ్లు ఆడటం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా యువత ఈ మాయలో పడి తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.
Also Read: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. పార్లమెంట్లో విపక్షాల పోరు!.
సాంకేతికతను విజ్ఞానం కోసం, పరిమితమైన వినోదం కోసం వాడాలే తప్ప అది వ్యసనంగా మారకూడదు. కైఫ్ మరణం కేవలం ఒక వార్త మాత్రమే కాదు, నేటి తరం యువతకు ఒక హెచ్చరిక. స్మార్ట్ఫోన్ తెర వెనుక ఉన్న ప్రమాదాలను గుర్తించి, సమయ పాలన పాటిస్తూ వాస్తవ ప్రపంచంలో గడపడం ఎంతో అవసరం. లేదంటే క్షణికానందం కోసం చూసే ఈ ఆటలు శాశ్వతమైన విషాదాన్ని మిగిలిస్తాయి.
పబ్జీ ఆడుతున్నారా?.. ఇది మీ కోసమే
నాలుగు నెలలుగా పబ్జీ గేమ్కు బాగా అలవాటు పడిన ఉత్తరప్రదేశ్-మేరఠ్కు చెందిన మహమ్మద్ కైఫ్(22)
శుక్రవారం హెడ్ ఫోన్స్ పెట్టుకుని అర్ధరాత్రి వరకు పబ్జీ ఆడుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన యువకుడు
మెంటల్ ప్రెజర్తో బీపీ 300 దాటి… pic.twitter.com/xzg76EUxSK
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2026