E-Paper
Advertisement

Death Threat : ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు.. రూ.20 కోట్లు డిమాండ్

Death Threat : ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు.. రూ.20 కోట్లు డిమాండ్

Death Threat : దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ముఖేష్ అంబానీకి ఈ-మెయిల్ పంపించారు. దేశంలో మంచి షూటర్లకు కొదవలేదని, ఆయన్ని కాల్చి చంపుతామంటూ బెదిరించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు మెయిల్‌ పంపిన అజ్ఞాత వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ ఆధీనంలో నడుస్తోన్న ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ కాల్ అందిన కొద్దిరోజుల్లోనే ముకేష్ అంబానీకి డెత్ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు.

ఇంతకుముందు కూడా ముకేష్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. 2021లో ఆయన నివాసం అంటాలియాకు అత్యంత సమీపంలో కారును పార్క్ చేసిన ఉదంతం అనేక మలుపులు తిరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే అనే బెదిరింపు లేఖనూ పోలీసులు ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయనకు బెదిరింపు మెయిల్ రావడం టెన్షన్‌ రేపుతోంది. తాము అడిగిన 20 కోట్ల రూపాయలను ఇవ్వకపోతే షూట్ చేసి చంపుతామని శుక్రవారం ఈ-మెయిల్ వచ్చింది. దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గమ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×