E-Paper
Advertisement

SC on Chandigarh Mayoral Polls : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం.. చంఢీగడ్ మేయర్ ఎన్నికలపై సుప్రీం

SC on Chandigarh Mayoral Polls : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం.. చంఢీగడ్ మేయర్ ఎన్నికలపై సుప్రీం
Supreme Court on Chandigarh Mayoral Polls

Supreme Court on Chandigarh Mayoral Polls:చంఢీగడ్ మేయర్ ఎన్నికలపై సుప్రీం కోర్టులో ఫిబ్రవరి 5 సోమవారం విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణ ప్రకారం ఎన్నికల అధికారి అనిల్ మసీహ్ అవినీతికి పాల్పడినట్లు కనిపిస్తోందని మౌఖింగా అన్నారు.

ఎన్నికల నిర్వహణ సమయంలో ఉన్న సీసీటీవి వీడియోలను జస్టిస్ డీవై చంద్రచూడ్ వీక్షించి ఆశ్చర్యపోయారు. బ్యాలట్ పత్రాలను నాశనం చేసేందుకు ఎన్నికల అధికారి ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. తప్పు చేస్తున్న భయం ఆ వ్యక్తి ముఖంలో కనపడుతోందని చెప్పారు. ఎన్నికల నిర్వహణ ఇలాగేనే చేసేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి అనిల్ మసీహ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. ప్రజాస్వామ్యం ఖూనీ చేసేందుకు ప్రయత్నించారని అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికల అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు.

చంఢీగడ్ మేయర్ ఎన్నికల్లో మొత్తం 36 ఓట్లు పోల్ అవగా.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి 20 ఓట్లు, బిజేపీకి 16 ఓట్లు దక్కాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కిన 20 ఓట్లలో 8 ఓట్లు చెల్లుబాటు కావని ఎన్నికల అధికారి నిర్ణయిస్తూ.. బీజేపీ విజయం సాధించిందని ప్రకటించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ఎన్నికల అధికారి అవినీతికి పాల్పడ్దారని పంజాబ్ హర్యాణా హై కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలపై స్టే ఇవ్వాలని కోరారు. కానీ హైకోర్టు అందుకు నిరాకరించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టు ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈ కేసుని ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×