E-Paper
Advertisement

Medha Patkar Sentenced In Defamation Case: పరువు నష్టం కేసు.. మేధా పాట్కర్‌కు ఐదు నెలల జైలు శిక్ష..

Medha Patkar Sentenced In Defamation Case: పరువు నష్టం కేసు.. మేధా పాట్కర్‌కు ఐదు నెలల జైలు శిక్ష..
Advertisement

Narmada Bachao Andolan activist Medha Patkar Sentenced in Defamation Case: పరువు నష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త మేధా పాట్కర్‌కు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ సాకేత్ కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి కేవీఐసీ ఛైర్మన్, ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేసిన పరువు నష్టం దావాలో సాకేత్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. అలాగే సక్సేనాకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని పాట్కర్‌ను కోర్టు ఆదేశించింది.

Advertisement

కాగా ఢిల్లీ సాకేత్ కోర్టు తీర్పుపై మేధా పాట్కర్ స్పందించారు. తాను ఎవరినీ కించపరిచే ప్రయత్నం చేయలేదని అన్నారు. తాను ఈ తీర్పును సవాల్ చేస్తానని తెలిపారు. సత్యాన్ని ఎప్పటికీ ఓడించలేరు అని పేర్కొన్నారు.

Advertisement

అటు సాకేత్ కోర్టు ఈ తీర్పును సవాల్ చేసేందుకు 30 రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది. అయితే మేధా పాట్కర్ చెల్లించే పరిహారం తమకు అవసరం లేదని ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి అందజేస్తామని వీకే సక్సేనా తరఫు న్యాయవాది వాదించారు. అయితే దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఫిర్యాదుదారుకు నష్టపరిహారం ఇస్తామని ఆపై మీ ఇష్టానుసారం దాన్ని పరిష్కరించుకోవచ్చని తెలిపింది.

దాదాపు రెండేళ్ల క్రితం ఓ టీవీ ఛానెల్‌లో తనపై కించపరిచే వ్యాఖ్యలు చేసి.. తన పరువుకు భంగం కలిగించే ప్రకటన చేసినట్లు సక్సేనా మేధా పాట్కర్‌పై రెండు పరువు నష్టం దావాలు వేశారు.

అయితే ఈ కేసులో పాట్కర్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. సక్సేనాకు వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రకటనలు పరువు నష్టం కలిగించడమే కాకుండా ప్రతికూల భావాలను ప్రేరేపించాయని అని మేజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×