BigTV English
Advertisement

Lord Ram: రాముడి ఉనికిని చెప్పే ఆధారాలేవీ లేవు: డీఎంకే మంత్రి

Lord Ram: రాముడి ఉనికిని చెప్పే ఆధారాలేవీ లేవు: డీఎంకే మంత్రి

Tamil Nadu: తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతానికి ఎక్కువ ప్రచారం, గౌరవం ఉన్నది. పెరియార్‌ను గౌరవిస్తారు. ఆయన ఆలోచనలను, తాత్వికతను అభిమానిస్తారు. అందుకే తమిళనాడులో హిందుత్వకు చోటు దక్కడం లేదు. పెరియార్ హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికీ డీఎంకేలో ఎక్కువ మంది పెరియార్ ఆలోచనా స్రవంతిని అనుసరిస్తారు. ఈ నేపథ్యంలోనే డీఎంకే మంత్రి ఎస్ఎస్ శివశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు నిజంగా చరిత్రలో ఉన్నట్టు, ఆయన ఉనికిని చెప్పే ఆధారాలేవీ లేవని చెప్పారు. రాముడిని కేవలం అవతారం అంటారని, అలాంటప్పుడు అవతారం నిజంగా ఉండేదని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.


చోళ వంశ పాలకుడు రాజేంద్ర చోళ జయంతిని పురస్కరించుకుని అరియలూర్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మంత్రి ఎస్ఎస్ శివశంకర్ హాజరై మాట్లాడారు. ‘మనం తప్పకుండా రాజేంద్ర చోళ జయంతిని వేడుక చేసుకోవాలి. మన జన్మభూమికి గౌరవం, వన్నె తెచ్చిన రాజేంద్ర చోళ జయంతిని తప్పకుండా స్మరించుకోవాల్సిందే. లేదంటే.. అసలు ఆధారాలే లేని విషయాలను వేడుక చేసుకునేలా ప్రజలను నెట్టేసే ముప్పు ఉన్నది’ ని శివశంకర్ పేర్కొన్నారు.

‘రాజేంద్ర చోళా నిజంగా ఇక్కడ బతికాడని చూపించడానికి ఆయన నిర్మించిన చెరువులు ఉన్నాయి. ఆయన నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. శిలాశాసనాలు, శిల్పాలు, ఇతర పురాతన వస్తువులపై ఆయన పేరు ఉన్నది. రాజేంద్ర చోళుడి గురించి చరిత్ర, ఆధారాలు ఉన్నాయి. కానీ, రాముడు నిజంగానే బతికాడని చెప్పడానికి ఆధారాలు ఏవీ లేవు. కేవలం మనల్ని తప్పుదోవ పట్టించడానికి, మన చరిత్రను మరుగున పడేయడానికి, వేరే చరిత్రనే గొప్పదని చిత్రీకరించు కుట్రలో భాగంగా ఈ పనులు జరుగుతున్నాయి’ అని శివశంకర్ తెలిపారు.


Also Read: అడవుల్లో అడ్డగోలు దందా! డెక్కన్ సిమెంట్స్‌కు రూల్స్ పట్టవా?

కాగా, తమిళనాడు బీజేపీ చీఫ కే అన్నామళై మంత్రి శివశంకర్‌కు కౌంటర్ ఇచ్చారు. గత వారమే న్యాయ మంత్రి తిరు రఘుపతి.. రాముడిపై ప్రేమ ఒలకబోశారని, సామాజిక న్యాయం, లౌకికత్వాన్ని తెచ్చిన పయనీర్ అని, సమానత్వం కోసం పాటుపడిన వారని రాముడిపై ప్రశంసలు కురిపించారని అన్నామళై గుర్తు చేశారు. ఇప్పుడేమో మరో డీఎంకే మంత్రి అసలు రాముడు అనేవారే లేరని అంటున్నారని, వీరిద్దరూ డిబేట్ పెట్టుకుని ఓ అభిప్రాయానికి రావాలని సెటైర్ వేశారు. తప్పకుండా రఘుపతి నుంచి శివశంకర్ తప్పకుండా రెండు మూడు విషయాలైనా తెలుసుకుంటారని వివరించారు. అన్నట్టు.. ప్రధాని నరేంద్ర మోదీ చోళ వంశానికి చెందిన సెంగోల్‌ను కొత్త పార్లమెంటు కాంప్లెక్స్‌లో పెట్టినప్పుడు వ్యతిరేకించింది వీరే కదా అంటూ చురకలంటించారు.

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×