Odisha Maoists : ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ పరిధిలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. రామగిరి అటవీ ప్రాంతంలో ఎస్ఓజీతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. 10, 11వ తేదీల్లో రాత్రి రామగిరి అటవీ ప్రాంతంలో 20 మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందుకున్న తరువాత కూంబింగ్ మొదలు పెట్టినట్లు సౌత్ రేంజ్ డీఐజీ రాజేష్ పండిట్ తెలిపారు.
ఒడిశా పోలీసులు, BSF, SOG జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రాజేష్ పండిట్ చెప్పారు. ఎదురుకాల్పుల తర్వాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఒక టిఫిన్ బాంబు, 3 రైఫిళ్లు, డిటోనేటర్లు, సోలార్ మొబైల్ ఛార్జర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు మావో పుస్తకాలు, యూనిఫాం, గంజాయి ఇతర సామాగ్రిని పోలీసులు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.